పరకాల, మార్చి 16 : పాఠశాలల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ (ఏసీజీఈ) యూ సృజన్తేజ అన్నారు. పరకాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ఎస్ఆర్ స్కూల్, మండలంలోని మల్లక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో పరీక్షల సమయంలో చేపట్టాల్సిన వసతులను అడిగి తెలుసుకున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు. ప్రతి విద్యార్థి కొవిడ్ నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
మండలంలోని జడ్పీ హైస్కూ ల్, సెయింట్ థెరిసా, ప్రభుత్వ జూనియర్ కళాశాలను పదో తరగతి పరీక్షా కేంద్రాల అసిస్టెంట్ కమిషనర్ సుజాన్ తేజా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలు ఉండగా, కొవిడ్ నేపథ్యంలో జూనియర్ కాలేజీలో మరో కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫర్నీచర్, ఎలక్ట్రిసిటి, టాయిలెట్స్, తాగునీటి వసతిని పరిశీలించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంఈవో విజయ్కుమార్, హెచ్ఎం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.
దామెర, మార్చి 16 : పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను పరీక్షల నియంత్రణ అధికారి, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ యు.సుజన్ తేజ పరిశీలించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ను పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో ఫర్నీచర్ సరిగా లేదని హెచ్ఎం ఆయన దృష్టికి తీసుకెళ్లగా సమీప పాఠశాల నుంచి తెప్పించుకోవాలని ఎంఈవో విజయ్కుమార్ను ఆదేశించారు.
శాయంపేట, మార్చి 16 : పదో తరగతి పరీక్షల నిర్వహణకు కేటాయించనున్న పరీక్ష కేంద్రాలను ఎగ్జామినేషన్స్ అసిస్టెంట్ కమిషనర్ సృజన్తేజ సందర్శించారు. శాయంపేటలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర, జడ్పీ బాలుర హైస్కూల్స్ను పరిశీలించారు. విద్యార్థులకు అన్ని వసతులు ఉండేలా చూడాలని స్థానిక సిబ్బందిని ఆదేశించారు.