మేడ్చల్ మల్కాజ్గిరి : ఓ భర్త తన భార్య లావుగా ఉందని వేధింపులకు గురి చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దుండిగల్ పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కానిస్టేబుల్ శివకుమార్, శ్రీలతకు కొన్నేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలం నుంచి భార్యను శివకుమార్ కొడుతున్నాడు. లావుగా ఉన్నావని ఆమెను కొద్ది రోజుల నుంచి కానిస్టేబుల్ హింసిస్తున్నాడు. దీంతో భర్త వేధింపులు తాళలేక శ్రీలత ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని శ్రీలత తల్లిదండ్రులు ఆరోపించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.