నాగర్ కర్నూల్ :
జిల్లాలోని అమ్రాబాద్ మండలం మల్లాపూర్ పెంటకు చెందిన 11మంది చెంచులు పెద్దబొడ్డు పాలవేరు (మాదం గడ్డలు) తవ్వడం కోసం అడవి లోకి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో అడవిలో చెలరేగిన మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అచ్చంపేట ప్రభుత్వ దవాఖానలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆయన సతీమణి అమల పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను విప్ ఆదేశించారు.