బండ్లగూడ/మైలార్దేవ్పల్లి, మార్చి 4 : రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవీకి నియోజకవర్గం పట్టభద్రులందరూ ఓటు వేసి గెలిపించాలని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి రుద్రరాజు పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఎన్నికల సమావేశానికి రుద్రరాజు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల వారికి సముచిత న్యాయం కల్పిస్తుందన్నారు. ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వాణీదేవికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని ప్రజలు ఇప్పటి వరకు జరిగిన ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి భారీ మెజార్టీని అందజేసి గెలుపించడం ఎంతో అభినందనీయమన్నారు. అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేకికి పట్టభద్రులందరూ ఓటు వేసి భారీ మెజార్టీని అందించాలన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులందరికీ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి లాభం చేకూర్చిందన్నారు. రాష్ట్రంలో పట్టభద్రుల సమస్యల పరిష్కారానికై సురభి వాణీదేవిని గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి లక్షా 34వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ మేయర్ మహేందర్గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్రెడ్డి, నార్సింగి చైర్మన్ రేఖాయాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి టీఆర్ఎస్తోనే సాధ్యమని మైలార్దేవ్పల్లి డివిజన్ అధ్యక్షుడు టి ప్రేమ్గౌడ్ పేర్కొన్నారు.గురువారం బాబుల్నగర్ ప్రాంతంలో ఇంటింటికీ తిరిగి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని స్థానిక నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ..టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవికి అమూల్యమైన ఓటుతో గెలిపించి విపక్షాలకు గుణపాఠం చెప్పాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఎస్ వెంకటేష్ ,యూత్ అధ్యక్షుడు రఘుయాదవ్,సీనియర్ నాయకులు సరికొండ వెంకటేష్ ,సోమ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బండ్లగూడ, మార్చి 4 : రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణిదేవీకి ఓటు వేసి గెలిపించేందుకు పట్టభద్రులు ముందుకు రావడం హర్షణీయమని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని పలువురు పట్టభద్రులైన యువకులు రంగారెడ్డి జిల్లా లీగల్ సెల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు యాసిన్ ఆయూబీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పార్టీలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ప్రకాశ్గౌడ్ మాట్లాడుతూ పట్టభద్రులందరూ సురభి వాణీ దేవికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.