న్యూఢిల్లీ: బోక్సామ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో ముగ్గురు భారత బాక్సర్లకు పతకాలు ఖాయమయ్యాయి. స్పెయిన్లోని కాస్టెలోన్ వేదికగా టోర్నీ జరుగుతుండగా.. మహిళల విభాగం క్వార్టర్స్లో భారత స్టార్ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరీకోమ్ (51 కేజీలు), సిమ్రన్జిత్ కౌర్ (60 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు) విజయాలు సాధించి, సెమీ స్ చేరారు. జియోర్డానా సొరెంటినోను మేరీకోమ్ చిత్తుచేయగా.. యూజినియా అల్బోన్స్ను సిమ్రన్ ఓడించింది.