కడ్తాల్, జూలై 25: మండలం లోని చెరువులు, కుంటలను సర్వే చేసి, హద్దులు నిర్ణయిస్తా మని చిన్న నీటిపారుదలశాఖ ఏఈ తిరుపతయ్య తెలిపారు. ఆదివారం మండల కేంద్రం లోని గుర్లకుంట, నాగిరెడ్డి కుం ట, దేవరచెరువు, కుమ్మరి కుం ట, ఉప్పరాశికుంటలను ఇరిగే షన్ వర్క్ ఇన్స్పెక్టర్ ఎల్లయ్య తో కలిసి ఏఈ పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఈ తిరు పతయ్య మాట్లాడుతూ మం డల కేంద్రంలోని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇరిగేషన్ డీఈఈ నరేం దర్రెడ్డి ఆదేశాల మేరకు కడ్తాల్ గ్రామంలోని చెరువులు, కుంటలను పరిశీలించామన్నారు. చెరువులు, కుంటలు వాననీటితో నిండి ఉన్నాయని, నీళ్లు తగ్గిన తర్వాత సర్వే చేసి హద్దులు పాతుతామన్నారు. గుర్లకుంట చెరువుకట్టతో పాటు అలుగు చిన్నదిగా ఉండటంతో, చెరువు పూర్తి స్థాయిలో నిండక ముం దే, వాన నీళ్లన్ని వృథా గా కిందకి పోతున్నాయని, చెరువు కట్టను, అలుగు ఎత్తును పెంచాలని ఎంపీటీసీ శ్రీనివాస్రెడ్డి, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్ ఏఈ దృష్టికి తీసుకొచ్చారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఏఈ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మం డల అధ్యక్షుడు దాసు, వార్డు సభ్యుడు భిక్షపతి, రవి, విష్ణువర్ధన్ పాల్గొన్నారు.