కోట్పల్లి, జూన్ 1: పేదింటి ఆడపిల్లల కల్యాణానికి తెలంగాణ ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకంతో అండగా ఉంటుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని బార్వాద్ గ్రామంలో రైతు వేదిక భవనంలో మండలంలోని సంబంధించి కల్యాణలక్ష్మి, షాదీముబారక్కు చెందిన 52 మంది లబ్ధిదారులకు రూ.52లక్షల 6వేల 32 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం కంకణాలపల్లి గ్రామంలో ఐకేపీ మండల ఇన్చార్జి బీమ్లానాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో లాక్డౌన్ అమలుచేసి, ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఆర్థిక ఫలాలు అందిస్తున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక ఫలాలను అందించేందుకు అనేక సంక్షేమ పథకాలను అమలుచేయడమే కాక, సమయానికి అందించి, దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగంలో ఎన్నో మార్పులు తెచ్చారన్నారు. నాడు రైతులు అనేక ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వం రైతును రాజుగా చేసి వారిలో సంతోషాన్ని చూస్తున్నారన్నారు. రైతులు ఆర్థికంగా ఎదుగాలని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, పండిన ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రాంచంద్రారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పంతగి మంజుల, వైస్ ఎంపీపీ ఉమాదేవి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సుధాకర్గౌడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు సత్యం, పార్టీ మండల అధ్యక్షుడు అనిల్కుమార్, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్యాదవ్, తాసిల్దారు అష్ఘాక్స్రూల్, వ్యవసాయాధికారి పాండురంగాచారి, సర్పంచ్ పట్లోళ్ల చంద్రకళ, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.