ధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలో వర్షాల కారణంగా తెగిపోయిన నాగసముందర్ వంతెన పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ధారూరు మండల పరిధిలోని నాగసముందర్-రుద్రారం గ్రామాల మధ్య ఉన్న వాగు తాత్కాలిక వంతెన నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పౌసుమి బసు మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగ కుండా నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్, కాంట్రాక్టర్ ను ఆదేశించారు. నాగసముందర్ వాగు తాత్కాలిక వంత్తెన నిర్మాణపు పనులకు ఇప్పటికే రూ.50వేలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ వెంట డీఈ శ్రీనివాస్, ఎఈ శ్రావణ్కుమార్, కాంట్రాక్టర్ తదితరులు ఉన్నారు.