ధారూరు : ధారూరు మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంలో శుక్రవారం వరలక్ష్మి పూజలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని నాగసముందర్ గ్రామంతో పాటు పలు గ్రామాల్లో వరలక్ష్మి వ్రతం పూజలు జరుపుకున్నారు. ఉదయాన్నే గ్రామంలోని మహిళలు తల స్నానాలు చేసి సాంప్రదాయ వస్త్రాలను ధరించి, నిష్టతో వరలక్ష్మీ దేవిని ఘనంగా అలంకరించి ఉపవాస దీక్షలతో చిన్న,పెద్దలు, మహిళలు అందరూ కలిసి పూజలు చేశారు. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ఆయా గ్రామాల గ్రామ పెద్దలు, మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.