కొడంగల్: మున్సిపల్ కార్మికులకు యూనిఫాంతో పాటు శానిటేషన్ వస్తువులను అందించారు మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేంగా యూనిఫాంతో పాటు సబ్బులు, టవల్, చెప్పులు తదితర వస్తువులను ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పారిశుధ్య పనుల్లో కార్మికుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని శానిటేషన్ వస్తువులను కూడా అందించడం జరిగిందన్నారు.
పరిశుభ్రతలే ఆరోగ్యాన్నికాపాడుతాయి కాబట్టి కార్మికులు విధుల పట్ల నిబద్ధతతో పనులు నిర్వర్తించి ప్రజా రోగ్యాలను కాపాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, కౌన్సిలర్ మధుసూదన్యాదవ్, కమీషనర్ నాగరాజుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.