కొడంగల్, ఆగస్టు :పట్టణ శివారులోని సిద్ధినాంపు ప్రాంతంలో బంజార భవన్ నిర్మాణానికి ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి రూ.1కోటి నిధులు మంజూరు అయ్యాయని సేవాలాల్ సేవా సమితి సభ్యులు, నియోజకవర్గ గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక ఆర్అండ్బీ అథితిగృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ కోరిన వెంటనే బంజారాలపై ఉన్న అభిమానంతో మంత్రులు సత్యవతిరాథోడ్, సబితాఇంద్రారెడ్డితో పాటు ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి బంజారభవన్కు స్థలంతో పాటు నిర్మానాణానికి రూ.1 కోటి నిధుల మంజూరుకు కృషి చేయడం పట్ల వారికి ప్రత్యేకంగా బంజారులు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
మంత్రులు, ఎమ్మెల్యే చూపిన చొరవకు బంజారులు సదా రుణపడి ఉంటామని తెలిపారు. బంజార భవన్ నిర్మాణానికి నిధులు మంజూరుతో సేవాలాల్ జయంతి ఉత్సవాల నాటికి భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకొంటామని, ఉత్సవాలను బంజార భవన్లో ఘనంగా నిర్వహించుకొంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేవా సంఘం అధ్యక్షులు దేశ్యానాయక్, గౌరవ అధ్యక్షులు రామునాయక్తో పాటు శంకర్నాయక్, దత్తునాయక్, టీటీ రామునాయక్, అన్నుబాయి, మంజూలాల్, పాండునాయక్, ఢాక్యానాయక్, నార్యానాయక్, శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.