కొడంగల్ : ఆడ పిల్లలున్నపేద కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అండగా నిలుస్తున్నాయని ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ తెలిపారు. శనివారం పట్టణంలోని 2వ వార్డులో లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి షాదీముబారక్ చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ఇంట్లో ఆడ పిల్ల వివాహం చేయాలంటే తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోంటారు.
అటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లలు అండగా ఉంటూ వారి వివాహాలకు రూ.1లక్షల 116లు అందిస్తున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కును అందించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్ మధుసూధన్ యాదవ్, మాజీ సర్పంచ్ రమేష్బాబు పాల్గొన్నారు.