వికారాబాద్ : రాఖీ పండుగ సమీపించడంతో రాఖీల కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. వికారాబాద్ పట్టణంలో ప్రధాన రోడ్లకు ఇరువైపులా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రాఖీ దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఈ దుఖాణాల్లో రూ.10 నుంచి రూ.వేల రూపాయల రాఖీలు ఉన్నాయి. వికారాబాద్ పట్టణ ప్రజలేకాకుండా చుట్టు పక్కల గ్రామాల ప్రజలు సైతం వీటిని కొనుగోలు చేసేందుకు వస్తున్నారు.
మహిళలు, చిన్నారులు ఆకర్షణీయంగా కనిపించే రాఖీలను కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నారు. గతంలో కంటే ఈ సారి ధరలు ఎక్కువగా ఉన్నా … అన్నా, తమ్ముళ్లకు రాఖీలు కట్టేందుకు సోదరీమణులు రాఖీలు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు. చిన్నారులను ఆకర్శించేందుకు మార్కెట్లోకి వివిధ రకాల రాఖీలు సైతం అందుబాటులోకి వచ్చాయి.