మర్పల్లి, ఆగస్టు : ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వరాష్ట్ర సాధనకోసం తన జీవితాన్నే అంకితం చేశారని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీటీసీ మధుకర్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకొని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్తో కలిసి జయశంకర్ సార్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జడ్పీటీసీ మధుకర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసిన తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సోమలింగం, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మల్లేశం, కో-ఆప్షన్ సభ్యుడు సొహెల్, ఎంపీటీసీ బాల్రెడ్డి, సర్పంచ్ లు పాండు, శివకుమార్, ఈసీ విఠల్, ఇతర అధికారులు పాల్గొన్నారు.