బషీరాబాద్ :పేదలు పస్తులుండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన ప్రతి పేదకు రేషన్ కార్డులు మంజూరు చేశారని పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో కొత్తగా 70 మందికి రేషన్ కార్డులు మంజూరయ్యాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నేరవేరుస్తూ వస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పవన్ఠాకూర్, వార్డు మెంబర్స్ రాజన్న, రాజుగౌడ్, అంజిగౌడ్, సిద్దార్థ్, తదితరులు పాల్గొన్నారు.