మర్పల్లి: అవసరమున్న రైతులు పంట నూర్పిడి కల్లాలను నిర్మించుకోవాలని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని రావులపల్లి గ్రామంలో నిర్మించిన పంట నూర్పిడి కల్లాలను, పశువులషెడ్డు నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పంట నూర్పిడి కల్లాలు, పశువుల షెడ్డు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించిందని అర్హులైన రైతులు వినియోగించుకోవాలని సూచించారు. నిర్మాణాలు పూరైన వాటికి బిల్లులు చెల్లించాలని టీఏ భాస్కర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీఏ విఠల్, అబ్రహం రైతులు పాల్గొన్నారు.