పరిగి, ఆగస్టు :సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సర్కారు పేదలకు అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పరిగిలోని తమ నివాసంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన రూ.14.97లక్షలకు సంబంధించిన చెక్కులు లబ్దిదారులకు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పొరేట్ దవాఖానలలో చికిత్స పొందిన పేద వారికి సీఎంఆర్ఎఫ్ ద్వారా సర్కారు తోడ్పాటు అందిస్తుందని చెప్పారు.
ఈ సందర్భంగా గండీడ్ మండలం దేశాయిపల్లికి చెందిన శివలీలకు చికిత్స నిమిత్తం రూ.7లక్షలు, పూడూరు మండలం కంకల్కు చెందిన లక్ష్మయ్యకు రూ.79వేలు, కులకచర్ల మండలకేంద్రానికి చెందిన అభయ్రామ్కు రూ.80వేలు ఎల్వోసీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి, దోమ జెడ్పీటీసీ కొప్పుల నాగారెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఎస్.భాస్కర్, నార్మాక్స్ డైరెక్టర్ పి.వెంకట్రాంరెడ్డిలు పాల్గొన్నారు.