బంట్వారం, ఆగస్టు:”దళిత బంధు” పథకం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో గురువారం మండల పరిధిలోని రొంపల్లి గ్రామంలో ఆమె ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఉమాదేవి చందూసింగ్ మాట్లాడుతూ ప్రతి దళితుడు అభివృద్ది సాధించాలంటే కష్టపడాలన్నారు. ప్రభుత్వం ఇస్తున్న దళిత బంధుతో మరింత అభివృద్ది సాదించడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న” దళిత బంధు” పథకంతో దళితులు ఆర్ధికంగా ఎదగడానికి వీలు కలుగుతుందని సర్పంచ్ ఉమాదేవి చందూసింగ్ అన్నారు.