మోమిన్పేట, ఆగస్టు:గ్రామాల్లో నేలకొన్నసమస్యల పరిష్కారం కోసం “మీతో నేను “కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం మండల పరిధిలోని చంద్రయాన్పల్లి,రావులపల్లి,ఆమ్రాది కలాన్ గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడి ప్రభుత్వ పథకాలు నేరుగా లాభ్దిదారుకు అందుతున్నాయా..? లేదా..? అని గ్రామంలో ఉన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు పలు కరెంట్,మురుగులు కాలువల నిర్వహణ,రెవెన్యూ,సీసీ రోడ్డు ల సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రయాన్ పల్లి గ్రామంలో నిరూపయోగంగా ఉన్న విద్యుత్ ట్రాన్సారం, స్తంభాలను అందుబాటులోనికి తీసుకోని గ్రామంలో కరెంట్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గ్రామంలో పటు చోట్ల మురుగు నీరు రోడ్లపై పారుతుందని గ్రామం స్వచ్ఛత కోసం 100 శాతం ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని,మురుగు కాలువల నిర్మాణలు ప్రారంభించి రోడ్లపై మురుగు నీరు నిల్వాకుండా చూడలని సర్పంచ్,పంచాయతీ కార్యదర్శికి సూచించారు.
రెవెన్యూ సమస్యలపై ధరణి పోర్టల్లో అందుబాటులో ఉన్న ఆప్షన్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశించారు. రావులపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీటి పైపు లైన్ లీకేజీలకు మరమ్మతులు వెంటనేచేయించి, రోడ్లు, డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ఆమ్రాది కలాన్ గ్రామంలో రోడ్డు మధ్యలో ఉన్న కరెంట్ పోల్ ను వెంటనే రోడ్డు పక్కకు మార్చలని, తీగలపై వాలిన చెట్లను తోలగించాలని ఆదేశించారు.
గ్రామం మధ్యలో సీసీ రోడ్డుకు సంబంధించిన పని అంచనా వేయమని పంచాయతీ రాజ్ అధికారులకు తెలిపారు. ప్రజల నుంచి నూతన రేషన్ కార్డు,పెన్షన్ కోసం దరాఖాస్తులు సేకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కుమార్,ఎంపీపీ వసంత వెంకట్, మండల పార్టీ అధ్యక్షుడు నర్సింహా రెడ్డి, ఎంపీటీసీలు,సర్పంచ్ లు, అంజయ్య, సుజాత, మండల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.