పూడూరు: దామగుండ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద ఆగస్టు 17న నిర్వహించే గోమాత, వృక్ష సంపద కాపడడం, నూతన దేవాలయ కమిటీ సభ్యుల బాద్యతల స్వీకారం కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానిస్తునట్లు మాజీ సొసైటీ చైర్మన్ నర్సింహ్మరెడ్డి, పూడూరు ఉప సర్పంచ్ టి.రాజేందర్లు పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రరెడ్డిని మర్యాదపూర్వకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వాన పత్రాన్నిఅందజేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మహేశ్రెడ్డి, ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల స్థానిక నాయకులను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. దామగుండం దేవాలయ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని వారు కోరారు. వీరితో పాటు టీఆర్ఎస్ మండల బీసీ సెల్ అధ్యక్షుడు అనంతరాములు, శేఖర్ తదితరులు ఉన్నారు.