పూడూరు, ఆగస్టు :రైతులు శాస్త్రీయ పద్దతులను అనుసరించి వ్యవసాయం చేస్తే పంటల దిగుబడి పేరుగుతుందని ఎడిఎ గోపాల్, వాలంతరీ డైరెక్టర్ కృష్ణరావు, నీటి పారుదల నిపుణులు రమణరెడ్డిలు పేర్కొన్నారు. గురువారం పూడూరు మండల పరిధిలోని పెద్ద ఉమ్మెంతాల్ రైతు వేదికలో నేల,నీటి సంరక్షణ, యాజమాన్య పద్దతులపై రైతులకు క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు తమ నేలలకు అనుకూలమైన పంటలను సాగు చేయాలన్నారు. బోరు బావులున్న నీటిని బట్టి పంటల సాగుపై దృష్టి పెట్టాలన్నారు. తక్కువ నీటి వసతి ఉన్నప్పుడు డ్రీప్,లేదా తుంపర్ల పద్దతిలో నీటీని పంట పొలాలకు వదలాలన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు క్షేత్రస్థాయి సాగుపై అవగాహన సదస్సులు నిర్వహించేందుకే 5వేల ఎకరాల భూమి విస్తీర్ణంలో రైతు వేదికలు ఏర్పాటు చేసి క్లస్టర్కు ఒక అధికారిని నియమించిదన్నారు. రైతులు పంటల సాగుపై ఎలాంటి సమస్యలు ఉన్న స్థానిక వ్యవసాయాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులు కూడా మారుతున్న కాలనుగుణంగా సాగు పద్దతులను నేర్చుకోవాలని సూచించారు. అనంతరం పంట పొలంలో రెన్గన్ ద్వారా పంట సాగుకు నీటి పారుదలపై రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీధర్గుప్త, ఎంపీటీసీ రామకృష్ణరెడ్డి, ఎడిఎలు వీరప్ప, సచిన్దత్తా, వాలంతరీ ఎడిఎ సునీత, హెచ్వో సంతోషి, ఎంఎవో సామ్రాట్రెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు.