పెద్దేముల్ : 18ఏండ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ను వేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా.సుధాకర్ షిండే అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్, సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియను, సిబ్బంది హాజరు పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. జిల్లా వైద్యాధికారి డా॥ సుధాకర్ షిండే మాట్లాడుతూ కరోనాను నిర్మూలించి మనను మనం రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ను వేయించుకోవాలని అన్నారు. ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తరువాత సుమారు 98 రోజుల నుంచి112 రోజుల మధ్య సెకండ్ డోస్ను తీసుకోవాలని, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల శరీరంలో యాంటీబాడీస్ అభివృద్ధి చెంది శరీరానికి సోకే వివిధ రకాల వైరస్ల నుంచి రక్షణ ఉంటుందని అన్నారు.