కోట్పల్లి, ఆగస్టు : ఎన్నారం గ్రామం అభివృద్దిలో దూసుకుపోతున్నది. తెలంగాణ రాష్ట్రం హరితమయం చేసేందుకు పరిశుభ్రత, పారిశుద్ద్యం, పచ్చదనంపై దృష్టి పెట్టడంతో అదే దిశగా గ్రామాల్లో అభివృద్ది, పరిశుభ్రత, పచ్చదనం వైపు పరుగులు పెడుతోంది. గ్రామాల రూపురేఖలు మార్చేందుకు తలపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో రాష్ట్రంలోని గ్రామాల రూపురేఖలు మారి అద్దంలా తళతళ మెర్తున్నాయి.
పల్లె ప్రగతిలో భాగంగా ఇంటింటికీ ట్రాక్టర్తో తడి, పోడి చెత్త ను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పల్లె ప్రగతి వనంలో వాకింగ్ ట్రాక్లు, పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. గ్రామంలో ఎటు చూసినా పచ్చని చెట్లతో, పరిశుభ్రతతో వెల్కం చెబుతున్నది.
అభివృద్దిలో పరుగులు పెడుతున్న గ్రామం…
మండలంలోని ఎన్నారం గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వనియోగం చేసుకుని, తలపెట్టిన పరిశుభ్రత, పారిశుద్ద్యం, పచ్చదనం వంటి ప్రగతి కార్యక్రమాలపై దృష్టి పెట్టి అభివృద్ది వైపు పరుగులు పెడుతుంది. గ్రామంలో మొత్తం 560 ఇండ్ల, 456 కుటుంబాలు, 3000 వేల జనాభతో 1976 ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి లో భాగంగా తడి,పోడి చెత్త సేకరణ, పల్లె ప్రకృతి వనం, పారిశుద్ద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు సావిత్రిగౌడ్. గ్రామంలో మురుగు కాల్వలు, సీసీ రోడ్లు పనులు పూర్తి చేశారు. నూరుశాతం మరుగుదొడ్లు పూర్తి చేశారు. గ్రామానికి రెండు వైపుల పొలిమేరా వరకు రోడ్లకు ఇరువైపుల పచ్చని చెట్లను ఏర్పాటు చేసి, ఎప్పటికప్పడు సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు.
గ్రామంలో అభివృద్ది పనులు…
గ్రామంలో మొత్తం రూ.1కోటి13 లక్షలతో అభివృద్ది పనులను నిర్వహించడం జరిగింది. జడ్పీ, ఎమ్మెల్యే, ఎంపీ, జీపీ లు కలిసి రూ.65లక్షల రూపాయల నిధులతోసీసీ రోడ్లు, రైతు పోలాలకు రోడ్లు వేయించడం జరిగింది. రూ. 12.60లక్షలతో స్మశాన వాటిన నిర్మాణం చేపట్టడం జరిగింది. రూ.2.50లక్షలతో డంపింగ్ యార్డును నిర్మించారు. 2.5లక్షలతో పార్కు అభివృద్ది. 50వేలతో నర్సరీ అభివృద్ది. రూ.10లక్షలతో గ్రామ పంచాయతీ కి ట్రాక్టర్ కొనుగోలు చేయడం జరిగింది. 1లక్ష రూపాయలతో పాడు పడ్డ ఇండ్లను తొలగించాం. గ్రామంలో గుంతలను పూడ్చినాం.
పక్కాగా పారిశుద్ద్య నిర్వాహణ…
గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి పంచాయతీ సిబ్బందితో వీధులు శుభ్రం చేయిస్తున్నాము. 10లక్షలతో ట్రాక్టర్ కోనుగోలు చేశాము. దాంతో పాటు ట్రాలీని కూడా కోనుగోలు చేశాము. ఇంటింటికీ ప్రతి నిత్యం గ్రామంలో సైరన్ వేసుకుని తిరుగుతూ తడి, పోడి చెత్తను వేర్వేగా సేకరించి, ఎరువులను తయారు చేసుకునేందుకు 2.50లక్షలతో డంపింగ్ యార్డును నిర్మించుకున్నాము. ప్రతి ఇంటికి కొత్త వెలుగులు అందించాలనే భావనతో పాత స్తంభాలను తొలగించి, కొత్తగా 117 స్తంభాలను ఏర్పాటు చేసి, 24 గంటల పాటు విద్యుత్ అంతరాయం లేకుండా చేశాము.
ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా: ఎన్నారం సర్పంచ్ ఈడ్గి .సావిత్రిగౌడ్
గ్రామానికో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి, ఉదయం, సాయంత్ర వాకింగ్, వ్యాయమాలు చేసుకుని ఆరోగ్యం కాపాడుకునేందుకు వీలుంటుంది. ప్రభుత్వ భూమిలో ఎకరం స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశాము. ఇందులో వివిధ రకాలైన 2000 వేల మొక్కలు నాటాము. టేకు, చింత, జామ, నీలగిరి, దానిమ్మ, ఉసిరి, చూనాబాదం, మందారం, కాగి, గానుగ, మొక్కలు నాటి, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాం. ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా…