వికారాబాద్: అనారోగ్యంతో ఓ మహిళా వికారాబాద్ పట్టణంలోని మెడిక్యూర్ ఆసుపత్రికి వైద్య చికిత్సల కోసం వచ్చింది. వైద్య పరీక్షలు చేయగా ఆమె కడుపులో 10కేజీల కణితి ఉన్నట్లు గుర్తించారు. శనివారం ఆసుపత్రి వైద్యులు నీలమ్మ (41) అనే మహిళలకు శస్త్ర చికిత్స చేసి కడుపులో ఉన్న 10 కిలోల కణితిని తొలగించారు. ఇలాంటి శస్త్రచికిత్సలు చేసి 10కిలోల కణితిని తొలగించడం మొదటిసారని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గతంలో నీలమ్మ శ్యాస తీసుకునేందుకు ఇబ్బంది పడేదని, శస్త్రచికిత్స చేయడంతో నీలమ్మకు ప్రాణాపాయం తప్పిందన్నారు.