బంట్వారం, ఆగస్టు : పట్టాదురుకు తెలియకుండా, మోసపూరితంగా చేసిన భూమి పట్టాను రద్దు చేయాలని, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నాగ్వారం గ్రామానికి చెందిన బండి సాయప్ప గురువారం స్థానిక తహాసీల్దార్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా ఆయన తన ఆవేదన వ్యక్తం చేశారు.
బండి సాయప్పరెండవ భార్య కూతురు మానస పేరున పొమ్మపూర్ సర్వే నెంబర్ 15/ఆ/ఆ లో 1.20 ఎకరాల పొలం ఉంది. కూతురు మైనర్ కావడంతో బండి సాయప్ప గార్డియన్గా ఉన్నాన్నారు. తమకు తెలియకుండా ఆశిరెడ్డిగారి స్వప్న పేరున మార్చి పట్టా చేసుకున్నారు. సదరు పట్టాను రద్దు చేసి, తమ పొలం పట్టాను తమకు ఇప్పించమని, మోసపూరితంగా పట్టా చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బండి సాయప్ప తహశీల్దార్ ను కోరారు.