దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలంలోని మాటూర్ గ్రామంలో కలెక్టర్ పౌసమిబాస్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గ్రామంలోని వైకుంఠధామం, పల్లెప్రకతి వనంతో పాటు డంపింగ్ యార్డ్, నర్సరీలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే నర్సరీలల్లో ఉన్న ఖాళీ పాకెట్లాల్లో విత్తనాలను నాటాలని కోరారు. నర్సరీ పనులు బాగున్నాయని సంతప్తి వ్యక్తం చేశారు. మిగిలి ఉన్న మొక్కలను ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమి నాటాలని కోరారు. పల్లెప్రకతి వనం-వైకుంఠధామం మధ్యలో రెండు బోర్లు వేయాలన్నారు.
అనంతరం దళిత వాడలో పర్యాటించి అక్కడ ఉన్న సమస్యలను పరిశీలించి మురికి కాలువల పరిశుభ్రత , ఇంటింటికి చెత్తసేకరణ చేపట్టి గ్రామంలో దోమలుప్రభలకుండా పరిశుభ్రంగా ఉండాలన్నారు. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోడ్లపై మురుగు నీరు ప్రవహించకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్నారు.
కొందరు మరుగుదొడ్లును స్టోర్ రూంలుగా మార్చుకోవాడంపై తీవ్రంగా స్పందిస్తూ ప్రతి ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లను వినియోగించుకునే లా చర్యలు చేపట్టాలని విధంగా గ్రామ సర్పంచ్ , పంచాయతీకార్యదర్శిని ఆదేశించారు. కిరాణా షాప్వారు ప్లాస్టిక్ వ్యర్థాలను మురికి కాలువలో వేసినందుకు రూ.1000 చొపున్న ఇద్దరికి జరిమాన విధించారు.
గ్రామంలో శిథిలావస్థకు చేరిన రెండు గృహాలను కూల్చివేయాని ,నిరుపయోగంగా పాతబావులను పూడ్చివేయాలనిఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషన్కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీఓ, డిపిఓ రిజ్వాన, పీఆర్ డీఈ లక్ష్మణ్ రావు, తహాసీల్ధార్హర్థిఫ్ సింగ్, గ్రామ సర్పంచు వెంకటమ్మ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.