ప్రముఖ తమిళ దర్శకుడు కేవీ ఆనంద్ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. సూర్య నటించిన వీడొక్కడే, బ్రదర్స్, బందోబస్త్, జీవా నటించిన రంగం, ధనుష్తో అనేకుడు వంటి సినిమాలకు కేవీ ఆనంద్ దర్శకత్వం వహించారు. రజినీకాంత్ నటించిన శివాజీ సినిమాకు సినిమాటోగ్రఫర్గా కూడా ఆయన పనిచేశారు. కేవీ ఆనంద్ మృతి పట్ల తమిళంతో పాటు తెలుగు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.