ఈసారి ఎండ తీవ్రత ఎక్కవుగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న ఈ వేడిని మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇక మూగజీవాల సంగతి ఏంటి? ఈ ఆలోచనే ఓ ఎన్నైరైని కదిలిచింది. జయశంకర్ భూపాలపల్లిజిల్లా కాటారం మండలం గారెపల్లికి చెందిన తోట సురేష్ ఈ మధ్యనే అమెరికా నుంచి స్వగ్రామానికి వచ్చాడు. తాగేందుకు నీరు దొరక్క ఇబ్బంది పడుతున్న మూగజీవాల పరిస్థితిని చూసి చలించిపోయాడు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలోని వన్యప్రాణులు నీరు, తిండి దొరక్క చనిపోవడాన్ని గుర్తించాడు. వెంటనే తన స్నేహితుల సాయంతో ఇదిగో ఇలా నీటి తొట్టెలను ఏర్పాటు చేశాడు. భూపాలపల్లి – కాళేశ్వరం వరకు ఉన్న అటవీ మార్గంలో నీటి తొట్టెలతో పాటు వన్యప్రాణుల కోసం ఆహారాన్ని కూడా ఏర్పాటు చేశాడు.