సమాజంలో సగభాగంగా ఉన్న మహిళల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు మహిళల పట్ల సీఎం కేసీఆర్ సానుకూల ధోరణికి ప్రత్యేక ఉదాహరణలు. మహిళా, శిశు సంక్షేమానికి 2016-17 బడ్జెట్లో రూ. 1,552 కోట్లు, 2017-18 బడ్జెట్లో 1,731.50 కోట్లు, 2018-19 బడ్జెట్లో రూ.1,798.82 కోట్లు, 2019-20 బడ్జెట్లో రూ.1628.24 కోట్లు, 2020-21లో రూ.1,548.20 కోట్ల నిధులను కేటాయించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మార్కెట్ కమిటీల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాటం సాగుతున్నది.
ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి తెలంగాణలోని తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం భావించింది. తల్లీ బిడ్డల ఆరోగ్యం కోసం అంగన్ వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని ప్రతి రోజూ అందిస్తున్నది. ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనం అందించే కార్యక్రమాన్ని నూతన సంవత్సర కానుకగా జనవరి 1, 2015 నుంచి అమలుచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి “ఆరోగ్య లక్ష్మి” అని పేరు పెట్టారు. రాష్ట్రంలోని 35,700 అంగన్ వాడీ కేంద్రాలు 149 ఐసిడిఎస్ ల ద్వారా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం 2015-16 బడ్జెట్లో రూ.327.69 కోట్లు, 2016-17 బడ్జెట్లో రూ. 451.85కోట్లు కేటాయించింది. పౌష్టికాహారం సరఫరాకు 2017-18 బడ్జెట్లో రూ.429 కోట్లు కేటాయించారు. 2018-19లో రూ.298 కోట్లు కేటాయించారు.
– ఏడు నెలల నుండి 3 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లలకు గతంలో నెలకు 8 కోడి గుడ్లు అందించే వారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకు 16 కోడిగుడ్లు అందిస్తున్నారు.
– గుడ్లతో పాటు గోధుమలు, పాలపొడి, శనగపప్పు, చక్కెర, నూనెలతో కూడిన రెండున్నర కిలోల ప్యాకెట్ను ప్రతి నెలా మొదటి తేదీన అందిస్తున్నారు.
– మూడు నుండి ఆరేళ్ల పిల్లలకు గతంలో నెలకు 16 గుడ్లు అందించేవారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకు 30 రోజుల పాటు రోజుకు ఒక గుడ్డు అందిస్తున్నారు. గుడ్లతో పాటు ప్రతిరోజు పిల్లలకు అన్నం, పప్పు, కూరగాయలు, స్నాక్స్ అందిస్తున్నారు.
– గర్భిణులు, బాలింతలకు గతంలో నెలకు 3 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, అరకిలో నూనె అందించేవారు. జనవరి 1, 2015 నుండి రోజూ ఒక పూట పోషకాలతో కూడిన సంపూర్ణ భోజనాన్ని 31,711 అంగన్ వాడి కేంద్రాలు, 3,989 మినీ అంగన్ వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు.
– 68 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో నెలకు 16 గుడ్లు, 81 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలో నెలకు 25 గుడ్లు అందించేవారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 149 ఐసిడిఎస్ ప్రాజెక్టుల్లో నెలకు 30 రోజుల పాటు గుడ్లు అందిస్తున్నారు.
– గుడ్లతో పాటు కనీసం 25 రోజుల పాటు సంపూర్ణ భోజనం, 200 మిల్లి లీటర్ల పాలు అందిస్తున్నారు.
ఈ పథకం ద్వారా ఎప్రిల్ 2020 నాటికి 4,61,800 మంది ఏడు నెలల నుండి ఆరు సంవత్సరాల పిల్లలు, మరియు 3,32,427మంది గర్బిణీ మరియు బాలింతలు లబ్ధిపొందుతున్నారు.
( Note – రోజువారీగా అందుతున్న పౌష్టికాహారం వివరాలు :బాలింతలకు రోజుకు 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 200 మి.లీటర్ల పాలు, 16 గ్రాముల నూనె, ఒక కోడిగుడ్డు చొప్పున పదిరోజులకు సరిపడా ఒకేసారి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా 15 రోజులకు సరిపడా రేషన్ కూడా అంగన్వాడీ కేంద్రాల నుంచి ఇస్తున్నారు. పిల్లలకు రోజుకు 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల నూనె, ఒక గుడ్డు చొప్పున ఇస్తున్నారు. మూడేండ్లలోపు పిల్లలకు బాలామృతం, గుడ్డు ఇస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా పౌష్టికాహారాన్ని వారి ఇండ్ల వద్దకే తీసుకెళ్లి అందజేశారు. )
రాష్ట్రంలోని 35 వేలఅంగన్వాడీకేంద్రాలకు 5.5 లక్షల లీటర్ల పాలను విజయ డెయిరీ ద్వారా సరఫరా చేస్తున్నారు. అయితే, ఈ కేంద్రాలకు పూర్తిస్థాయిలో అవసరమైన 20 లక్షల లీటర్ల పాలను కూడా ఈ డెయిరీ నుంచే సరఫరా చేయనున్నట్లు మంత్రితలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
మాతాశిశు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చి గర్భిణులకు రూ.12 వేలు, కేసీఆర్ కిట్స్ వంటి భారీ పథకాలను అమలుచేస్తున్న నేపథ్యంలో వాటిపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రభుత్వం మహిళా ఆర్గనైజర్లను నియమించింది. ఈ దిశగా ప్రతి రెండు జిల్లాలకు ఒకరు చొప్పున, హైదరాబాద్ కు ప్రత్యేకంగా ఒక మహిళా ఆర్గనైజర్ చొప్పున ప్రభుత్వం 16 మందిని 5 జూన్, 2017న నియమించింది. వీరు తమ పరిధిలో అమలు జరిగే అన్ని రకాల మహిళా సంక్షేమ కార్యక్రమాలు, మాతాశిశు సంక్షేమ పథకాల అమలు సమన్వయంతోపాటు వాటి అమలు తీరును పర్యవేక్షిస్తారు. వీరు జిల్లా కేంద్రాల్లోని మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయం వేదికగా విధులు నిర్వర్తిస్తారు. ఒక్కో ఆర్గనైజర్ కు నెలకు రూ.51 వేలు గౌరవ వేతనం, ప్రయాణ భత్యం (కిరాయి వాహనాల ఖర్చు) కింద రూ.45 వేలు, టెలిఫోన్ బిల్లులకు రూ.2 వేలు, సర్వీస్ పోస్టేజీ కోసం రూ.1 వేయి, స్టేషనరీకి రూ.2 వేలు, డి.ఎ. రూ.4,500 అందిస్తున్నారు.వీరంతా రెండేళ్లపాటు ఈ పదవుల్లో కొనసాగారు.
వంట కోసం కిరోసిన్ వాడని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని భావించిన ప్రభుత్వం అర్హులందరికీ దీపం కనెక్షన్లు అందిస్తున్నది. 2000-14 వరకు 14 సంవత్సరాలలో అప్పటి ప్రభుత్వాలు 19.84 లక్షల దీపం కనెక్షన్లు ఇచ్చాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 45 నెలల కాలంలో 9.97 లక్షల మందికి దీపం కనెక్షన్లు మంజూరయ్యాయి. దీనికి రూ.96.74 కోట్లు కేటాయించారు. 6.16లక్షల దీపం కనెక్షన్లు విడుదల అయ్యాయి. మరో 3.81 లక్షల కనెక్షన్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతున్నది. ‘‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ పథకం’’ కింద రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల గ్యాస్ కనెక్షన్లు కేటాయించాలని ఆయిల్ కంపెనీలను సంప్రదించింది. దీని ద్వారా ‘‘కిరోసిన్ ఫ్రీ స్టేట్’’ చెయ్యాలని ప్రభుత్వ సంకల్పం. 2016-17 సంవత్సరంలో గ్యాస్ కనెక్షన్ల కోసం బడ్జెట్లో 21 కోట్ల రూపాయలను కేటాయించింది. ఎస్సీ ప్రణాళిక కింద 3.86 కోట్ల రూపాయలు, ఎస్టీ సబ్ ప్లాన్ కింద 2.36 కోట్లు కేటాయించింది. మొత్తంగా 27.22 కోట్ల రూపాయలను గ్యాస్ కనెక్షన్ల కోసం కేటాయించింది.
ఆరేండ్ల తర్వాత వంటగ్యాస్ సిలిండర్ల ధరలను పెంచుతూ 12 ఫిబ్రవరి 2020న కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14.2 కిలోల వంటగ్యాస్ ధరను రూ.769 నుంచి ఒక్కసారిగా రూ.913.50కు పెంచింది. వినియోగదారులకు గతంలో రూ.200.50 సబ్సిడీ వచ్చేది. ఇకపై 345.50 రాయితీ బ్యాంకు ఖాతాలో పడనుంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మూడు సంవత్సరాలలో ప్రభుత్వం రెండు సార్లు అంగన్ వాడీ ఉద్యోగుల జీతాలను పెంచింది. మొదటగా అంగన్ వాడీ కార్యకర్తల జీతాన్ని రూ.4,200 నుంచి రూ.7,000లకు, సహాయకుల వేతనాలను రూ.2,200 నుంచి రూ.4,500కు పెంచుతూ ప్రభుత్వం మార్చి11,2015న అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంది. పెంచిన జీతాన్ని మార్చి, 2015 నుంచే ఇస్తున్నారు. ఈ పెంపుతో అప్పుడు ప్రభుత్వం పై అదనంగా రూ.205 కోట్లు భారం పడింది. రెండో పర్యాయం ఫిబ్రవరి 27, 2017న అంగన్ వాడీ కార్యకర్తలు, హెల్పర్ల ప్రతినిధులతో ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో వారి జీతాలు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో 31,711 మంది అంగన్ వాడీల జీతాలు రూ.4,200 నుంచి రూ.10,500 (150 శాతం) కు పెరిగాయి. 3,989 మినీ అంగన్ వాడీ టీచర్లు, 31,711 మంది హెల్పర్లు కలిపి 35,700 మంది జీతాలు 4,500 నుండి 6 వేలకు పెరిగాయి. పెరిగిన జీతాలు ఏప్రిల్ 2017 నుంచి అమలయ్యాయి. 2017-18 బడ్జెట్లో అంగన్ వాడీల జీతాలకు రూ.459.71 కోట్లు కేటాయించారు.
తమ పిల్లలకు ఆంగ్ల విద్య అందాలనే ఆకాంక్ష తల్లిదండ్రుల్లో బలంగా ఉండటంతో అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తగా ఆంగ్ల బోధనను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తున్నది. దీంతో రాష్ట్రంలో అంగన్వాడీకేంద్రాలు ప్రీ స్కూళ్లుగా మారనున్నాయి. చిన్నారుల్లో ప్రేరణ కలిగించేందుకు కొత్త పాఠ్యాంశాలు అందుబాటులోకి రానున్నాయి. ఇన్నాళ్లు అంగన్వాడీల్లో అ.. ఆ లు నేర్చుకున్న పిల్లలు.. ఇపై ఏ బీ సీ డీ.. వన్ టూ త్రీలు దిద్దనున్నారు. ఇప్పటివరకు అక్కడక్కడ చెప్పిన ఆంగ్ల పాఠాలు.. ఇకనుంచి అధికారికంగా పూర్తిస్థాయిలో అమలుకానున్నాయి. కొత్త కథలతో ఆన్లైన్ పాఠాలు సైతం చిన్నారులకు అందుబాటులోకి రానున్నాయి. ఆటపాటలతో మరింతగా పిల్లల్లో మానసిక వికాసం పెంచుబోతున్నారు అంగన్వాడీ టీచర్లు.
కరోనా ప్రభావం తగ్గిన తర్వాత అంగన్వాడీకేంద్రాల్లో బోధనను ఆన్లైన్లో సాగించేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) కింద 149 ప్రాజెక్టుల పరిధిలో 36,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇకపై ఈ కేంద్రాలను ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పూర్వ ప్రాథమిక పాఠశాల భవనాల్లో ప్రీ స్కూళ్లుగా నిర్వహించనున్నారు. కొత్త పాఠ్యాంశాల్లో కథలు, పాటలు, ఆటలు, మానసిక అభివృద్ధి కార్యక్రమాలను వీడియోలుగా రూపొందించింది.
రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య పరిరక్షణ విషయంలో ఆశ వర్కర్లను ప్రభుత్వం మరింతగా భాగస్వాములను చేసింది. క్షేత్ర స్థాయిలో ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆశ వర్కర్లకు నెలకు కేవలం రూ.1,000 నుంచి రూ.1,500 మాత్రమే పారితోషికం లభించడం సరికాదని భావించిన సీఎం కేసీఆర్ వారి జీతాన్ని 6 వేలకు పెంచారు. 2017 మే 5న ప్రగతి భవన్లో ఆశ వర్కర్లతో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని 27,045 మంది వారి పారితోషికాన్ని అదే నెల నుంచి రూ.6 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్హతలుండి, శిక్షణ పొందిన ఆశవర్కర్లకు ఏఎన్ఎం ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించింది. ఆశ వర్కర్లను తెలంగాణ గ్రామీణ ఆరోగ్య కార్యకర్తలుగా పిలవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణలోని పాఠశాలల విద్యార్థినుల కోసం ప్రభుత్వం బాలికా ఆరోగ్యరక్ష పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీలలో చదువుకుంటున్న 8 లక్షల మంది విద్యార్థినులకు హెల్త్, హైజెనిక్ కిట్స్ అందిస్తున్నారు. 24 ఆగస్టు, 2018 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఒక్కోటి రూ.400 విలువచేసే ఈ కిట్ లో బాలికలకు అవసరమైన వస్తువులు ఉన్నాయి. వాటిలో నాలుగు స్టే-ఫ్రీ న్యాప్ కిన్స్, రెండు టూత్ పేస్ట్ ట్యూబులు, టూత్ బ్రష్, టంగ్ క్లీనర్, కొబ్బరి నూనె, పౌడర్, అద్దం, దువ్వెన, జడ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, షాంపూ, బొట్టు స్టిక్కర్ల ప్యాకెట్లు, 3 స్నానపు సబ్బులు, రెండు బట్టల సబ్బులు ఉంటాయి. ప్రతీ 3 నెలలకు ఒకసారి చొప్పున ఏడాదికి నాలుగుసార్లు విద్యార్ధినులకు ఈ కిట్స్ అందజేస్తారు. ఆరోగ్య రక్ష కిట్ల పేరుతో ప్రతి బాలిక పై ఏడాదికి రూ.1,600 చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.
బాలికలలో రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం, వారికి 2018-19 విద్యాసంవత్సరం నుంచి పౌష్టికాహారం అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం మధ్యాహ్న భోజనంలో నెలకు 4సార్లు చికెన్, రెండుసార్లు మటన్, వారానికి ఐదుసార్లు గుడ్లు, ప్రతీరోజూ 50 గ్రాముల నెయ్యి అందించేలా కొత్త మెనూ రూపొందించింది.
– గ్రామీణమహిళల్లోరక్తహీనతతీవ్రంగాఉండటంతోగర్భిణి, ప్రసవం, నెలసరిసమయంలో 76 శాతంమందిఇబ్బందులుఎదుర్కొంటున్నట్లుఓసర్వేలోవెల్లడైంది. -దీంతోమహిళాసంఘాలభాగస్వామ్యంతోవారికిబలవర్ధకమైనఆహారంఅందించాలని, తాజాకూరగాయలు, పండ్లు, ఆకుకూరలనుఅందుబాటులోకితీసుకురావాలనిప్రభుత్వంన్యూట్రీగార్డెన్స్కుశ్రీకారంచుట్టింది. రాష్ట్రంలోని 437 మండలాల్లో 1,622 గ్రామాల్లోపైలట్ప్రాజెక్టుగా‘న్యూట్రీగార్డెన్స్’ పేరుతోసేంద్రియసాగుమొదలైంది. సాగుతోపాటు, ఉత్పత్తులనువిక్రయించేందుకుసెర్ప్నుంచిరూ. 1 లక్షవరకుఆర్థికసాయంకూడాచేస్తున్నారు. -న్యూట్రీగార్డెన్స్లోఇద్దరురైతులతోఅరెకరంలోకూరగాయలు, పండ్లు, ఆకుకూరలసాగునుచేపడుతున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటులో భాగంగా పలు వ్యాపారాలు చేస్తున్న మహిళా సంఘాలకే న్యూట్రీ గార్డెన్స్ బాధ్యతలను సైతం అప్పగించారు.మహిళా సంఘాల మహిళలతోపాటు పలువురికి ఉపాధి కల్పించడం, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించే లక్ష్యం గా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీనిలోభాగంగా సెర్ప్ నుంచి ఎలక్ట్రానిక్ వాహనాన్ని కొనుగోలు చేసిచ్చారు. రూ.1.60 లక్షల విలు వైన ఈ వాహనంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లకు వేర్వేరుగా అరలను ఏర్పాటుచేశారు. మండల పరిధిలో ఈ వాహనం తిరుగుతూ సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తున్న కూరగాయలను విక్రయిస్తుంది.
మహిళా స్వయం సహాయక సంఘాల రుణ పరిమితిని ప్రభుత్వం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. దీని వల్ల రాష్ట్రంలోని 4.60 లక్షల స్వయం సహాయక గ్రూపుల్లోని 83.58 లక్షల కుటుంబాలకు మేలు కలుగుతున్నది. వడ్డీ లేని రుణం కోసం ప్రభుత్వం చేస్తున్న వ్యయం రూ. 441 కోట్లు. 2016-17 సంవత్సరానికిగాను బడ్జెట్లో రూ.148 కోట్లు, 2017-18 రూ.1245.34 కోట్లు కేటాయించారు. 2020-21 బడ్జెట్లో రూ.900 కోట్లు, అర్బన్ ప్రాంతాలకు రూ.300 కోట్లు మంజూరు చేసింది.
మహిళా స్వశక్తి సంఘాల ఆర్థికాభ్యున్నతి కోసం వడ్డీలేని రుణాలను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. వ్యాపారం, ఉపాధి నిమిత్తం ఆ సంఘాలకు, సభ్యులకు స్త్రీనిధి రుణాలు అందిస్తున్నది. దీంతో స్వశక్తి సంఘాలకు గ్రూపులవారీగా రూ.50 వేల నుంచి రూ.10 లక్షల వరకు, సభ్యులుగా ఉన్న మహిళలకు రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు రుణాలిస్తున్నారు. 2017-18లో స్త్రీనిధి బ్యాంకు 1,850 కోట్ల రుణాలను అందజేసింది. 2018-19లో స్త్రీ నిధి కింద 2.04 లక్షల మహిళా సంఘాలకు రూ.2,320 కోట్ల రుణాలు అందించారు. 2019-20 లో రూ.2,900 కోట్ల రుణ లక్ష్యాన్ని సాధించింది. 2020-21లో రూ.2,400 కోట్లను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
డిసెంబర్ 2020 నాటికి రూ.1,140 కోట్ల రూపాయలను రాష్ట్రంలోని 2లక్షల74వేల సభ్యులకు ఇచ్చారు. మహిళల పొదుపు సంఘాలకు వడ్డీ రాయితీని ప్రభుత్వమే ఇస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తేదీ 14 ఆగస్టు 2018న హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలోని 4.60 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 46 లక్షల మంది మహిళలు తీసుకున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం తనవాటా వడ్డీని చెల్లించింది.
మహిళా స్వయం సహాయక సంఘాలకు 2015-16లో రూ.8 వేల కోట్లు, 2016-17లో రూ. 8 వేల కోట్లు, 2017-18లో రూ.7 వేల కోట్లు రుణాలుగా ఇచ్చారు. 2018-19 లో రూ.6,048.27 కోట్ల వార్షిక ప్రణాళిక ఉండగా ఆ లక్ష్యానికి మించి రూ.6,166 కోట్లు అందించారు. 2019-20 కి గాను మహిళా సంఘాలకు అందించే రుణ లక్ష్యాన్ని రూ.6,584 కోట్లు గా ప్రణాళిక సిద్దం చేసి ఆ లక్ష్యాన్ని పూర్తిచేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.10,267 కోట్ల రుణం ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. జనవరి 2021 నాటికే రూ.7,519 కోట్లు (73 శాతం) మహిళా సంఘాల వద్దకు చేరాయి. నిర్ణీత సమయంలో బ్యాంకులకు రుణాల వాయిదాలు చెల్లించిన 99 శాతం సంఘాలన్నింటికీ వడ్డీ రాయితీ వర్తించింది. ఈ క్రమంలో కేంద్రం నుంచి రావాల్సిన రూ.339 కోట్లు మినహా.. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.1,600 కోట్ల వడ్డీ రాయితీ సొమ్మును ఆయా సంఘాల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.
జనాభాలో సగభాగం ఉన్న మహిళలు స్వశక్తితో ఎదిగేలా స్వయం సహాయక సంఘాల నుంచి ఆర్థిక తోడ్పాటు అందుతున్నది. సెర్ప్ ద్వారా బ్యాంకులు గ్రామీణ మహిళాసంఘాలకు పెద్దఎత్తున రుణాలు ఇస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన నాటితో పోల్చితే మహిళా సంఘాలకు రుణాలు దాదాపు మూడింతలు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది రూ.3,700 కోట్ల రుణమివ్వగా.. 2020-21నాటికి అది మూడింతలై రూ.10,267 కోట్లకు చేరింది. 98 శాతం రికవరీ రేటు ఉండటంతో బ్యాంకులు కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. మహిళా సంఘాలకు ఆర్థికంగా చేయూతనిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా, ఏపీ రెండోస్థానంలో ఉన్నది.
-బ్యాంకుల వడ్డీ కంటే తక్కువ కేవలం 11.5శాతం వడ్డీ మాత్రమే వసూలు చేస్తున్నారు.
-వసూలు చేసే వడ్డీలో 10శాతం మరలా మహిళాసంఘాలకే ఇస్తున్నారు.
-మహిళా సమాఖ్యలకు ఇచ్చే వడ్డీ కూడా బ్యాంకుల వడ్డీకంటే 3శాతం వరకు ఎక్కువగా ఇస్తున్నారు.
-ఒకవేళ రుణం తీసుకున్న మహిళ చనిపోతే, ఆ తర్వాత రుణం చెల్లించాల్సిన అవసరం లేకుండా చేశారు. పైగా, చనిపోయిన మహిళ బతికున్నంతవరకు చెల్లించిన డబ్బు మొత్తాన్ని ఆమె వారసులకు స్త్రీనిధి సురక్ష పథకం ద్వారా తిరిగి అందిస్తున్నారు. చనిపోయిన సభ్యురాలి అంత్యక్రియల కొరకు, అదేరోజు 5వేలు ఆమె కుటుంబసభ్యులకు చెల్లిస్తున్నారు. ఎక్కువ పాల దిగుబడి కోసం మంచి పాలిచ్చే పాడిపశువులను కొనడానికి 60వేలరుణాన్ని 75వేలకు పెంచారు. 50 నుండి 100పెరటికోళ్ళ పెంపకం కోసం ఒక్కో సభ్యురాలికి 12వేల500 నుంచి 22వేల వరకు ఋణం ఇస్తున్నారు.
-రాష్ట్రంలో 5వేల కోళ్ళ పెంపకం యూనిట్లకు రుణాలు అందిస్తున్నారు.
-పెరటికోళ్ళ ఉత్పత్తి కేంద్రాన్నిపెట్టడానికి 3లక్షల వరకు ఋణం పొందవచ్చు.
– కాలుష్యం లేకుండా.. తక్కువ ఖర్చుతో నడిచే, ఒక్కో ఎలక్ట్రిక్ ఆటోల కొనుగోలుకు 3లక్షల వరకు ఋణం పొందవచ్చు. 2020-21లో వెయ్యి ఆటోలకు రుణాలు అందించనున్నారు.
-రోడ్ల మీద చిన్నచిన్న దుకాణాలు పెట్టకునే వారిని ఆదుకోవడానికి 10వేల వరకు రుణాలిస్తున్నారు. డిసెంబర్ 2020 నాటికి రాష్ట్రంలో 22వేల600 మంది వీధివర్తకులకు రుణాలు అందించారు.
-మారుమూల గ్రామాలకు బ్యాంకు సేవలు విస్తరించడానికి 11వందల గ్రామాల్లో స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంకుల సేవాకేంద్రాలు మహిళలే నిర్వహించేలా చేశారు.
-ఉపాధి హామీ కూలీలకు వేతనాలు కూడా ఇలాంటి సేవా కేంద్రాలే ఇస్తున్నాయి.
-ఒక్కో సేవా కేంద్రం ద్వారా నెలకు ఒక్కో సభ్యురాలు సగటున 13వేల ఆదాయంపొందుతున్నారు. ఏదైనా ప్రాజెక్టు పెట్టుకోవాలనుకునే వారు వారికి నచ్చిన ప్రాజెక్టును వారి ఊళ్లోనే పెట్టుకునే విసులుబాటు కల్పించారు.
అర్హతగలప్రతిసభ్యురాలుమూడుఏండ్లకుఒక్కేఒక్కసారి690రూపాయలనుప్రీమియంగాచెల్లించాలి. ఈనిధినిమొత్తాన్నితిరిగిసులభవాయిదాల్లోచెల్లించేవిధంగామహిళలకేరుణంగాఅందిస్తారు. ఈపథకంలోచేరినసభ్యురాలుమరణిస్తే, లక్షవరకుసభ్యురాలివారసులకుచెల్లిస్తారు.
మహిళాసంఘాల సభ్యుల అభ్యున్నతికి 2020-21 ఆర్థిక సంవత్సరంలో అమలుచేయాల్సిన పథకాలపై స్త్రీనిధి పాలకవర్గం 24 సెప్టెంబర్, 2020న కీలక నిర్ణయాలు తీసుకున్నది.
పాడిపశువుల కొనుగోలుకు రూ.75 వేల రుణం : రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ.75 వేల రుణంతో 50 వేల పశువులను (మేలు జాతి ముర్రా గేదెలు, సంకర జాతి ఆవుల) అందించాలి. ఇతర రాష్ర్టాల నుంచి వీటిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
స్వయం సహాయక సంఘాలకు వీరికి అదనపు ఆదాయం సమకూర్చడం కోసం 5వేల యూనిట్లకు రుణాలు అందించాలి. ఒక్కో యూనిట్లో 50 నుంచి 100 కోళ్లు పెంచటానికి రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు రుణం ఇవ్వాలి. 2వేల కోడి పిల్లల 150 మదర్ యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడిని రుణంగా సమకూర్చాలి.
వ్యవసాయ యంత్రాలు, పనిముట్లను రైతులకు అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి తేవాలి. రాష్ట్రంలో 100 కేంద్రాలు నెలకొల్పాలి. ఈ కేంద్రాలు నెలకొల్పటానికి మండల సమాఖ్యలకు రూ.25 లక్షల వరకు రుణాలు ఇవ్వాలి.
సంఘ సభ్యుల కోసం స్త్రీనిధి సురక్ష పథకం అమలుచేయాలి. దీనిద్వారా సంఘ సభ్యులకు రూ.లక్ష వరకు బీమా చేయవచ్చు. ఒక సభ్యురాలు సంవత్సరానికి రూ.230 చొప్పున 3 సంవత్సరాలకు రూ.690 కట్టి పథకంలో చేరాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరేందుకు అయ్యే మొత్తాన్ని రుణంగా ఇస్తారు. ఒకవేళ సభ్యురాలు మరణిస్తే ఆమె వారసులకు రూ.లక్ష చెల్లిస్తారు.
మహిళా సంఘాల కార్యకలాపాలను వేగంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు 2018 జూన్ 15న స్త్రీనిధి బ్యాంకు ద్వారా గ్రామ మహిళాసంఘాలకు ట్యాబ్లు అందజేశారు. రుణాల కోసం గ్రామం నుంచి వచ్చే దరఖాస్తులను వీటి ద్వారా పరిశీలించవచ్చు. ఆధార్, ఐరిస్ అథెంటికేషన్ సౌకర్యాన్ని కూడా వీటిలో పొందుపరిచారు.తద్వారా వారు ఉన్నచోటు నుంచే రుణ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. భవిష్యత్లో ఆసరా పింఛన్లు, ఉపాధి కూలీల చెల్లింపులు కూడా వీరి ద్వారా చెల్లించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
షీ క్యాబ్స్ :2015 సెప్టెంబర్ 8న రాష్ట్ర ప్రభుత్వం షీ క్యాబ్స్ పేరిట కొత్త ప్రోగ్రామ్ను ప్రారంభించింది. దీన్ని మహిళా డ్రైవర్లను ప్రోత్సహించడం కోసం ప్రవేశపెట్టారు.ప్రతి క్యాబ్కు రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం సబ్సిడీని అందిస్తున్నది.
అనాథలైన చిన్నారులు, ఇండ్ల నుంచి పారిపోయి వచ్చిన బాలలు, బాల కార్మికుల కోసం ప్రభుత్వం ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను చేపట్టింది. పోలీస్శాఖ ఆధ్వర్యంలో ఏటా జనవరి ఒకటి నుంచి 31వ తేదీవరకు ఆపరేషన్ స్మైల్, జూలై ఒకటి నుంచి 31వ తేదీవరకు ఆపరేషన్ ముస్కాన్ పేరిట డ్రైవ్ నిర్వహిస్తున్నారు. పోలీస్శాఖతోపాటు మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ, కార్మిక, ఆరోగ్యశాఖలు, చైల్డ్వెల్ఫేర్ కమిటీలు(సీడబ్ల్యూసీ), జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, ఎన్జీవోల భాగస్వామ్యంతో ఈ డ్రైవ్లను నిర్వహిస్తున్నారు. ప్రతి సబ్డివిజన్ పరిధిలో ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లను ఒక బృందంగా ఏర్పాటు చేసి రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ఆలయాలు, కార్ఖానాలు, ఇటుకబట్టిలు, చౌరస్తాలు వంటి ప్రదేశాల్లో ఎవరి అండాలేకుండా భిక్షాటన చేస్తున్న చిన్నారులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు. తర్వాత వారి నుంచి వివరాలు సేకరించి, సంబంధీకులకు అప్పగిస్తున్నారు. అనాథలు, అడ్రస్ తెలియని చిన్నారులను ఆయా జిల్లాల్లో చైల్డ్హోంలకు తరలించి ఆశ్రయం కల్పిస్తున్నారు. చిన్నారుల జాడ కనిపెట్టేందుకు పోలీసులు దర్పన్, టీఎస్కాప్ టెక్నాలజీను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా ఆయా పోలీస్స్టేషన్ల పరిధిలోని మిస్సింగ్కేసుల్లో చిన్నారుల పోలికలు, వివరాలతో పోల్చి సమాచారం ఇస్తున్నారు. 2015 నుంచి జనవరి 2019 నాటికి రాష్ట్రవ్యాప్తం గా 25,116 మంది చిన్నారుల ను పోలీసులు రక్షించారు. వీరిలో 12,283 మంది చిన్నారుల ను తిరిగి వారి తల్లిదండ్రులు, సంరక్షకుల వద్దకు చేర్చారు.
బాలల పరిరక్షణకు పనిచేస్తున్న విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ ప్రభుత్వం బాలరక్షభవన్ వ్యవస్థను ఏర్పాటుచేసింది. ఆయా విభాగాల సీడీపీవోలు, ఏసీడీపీవోలే బాలరక్షభవన్ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారు. మొత్తం 33 జిల్లాలకు కోఆర్డినేటర్లను ప్రభుత్వం నియమించింది. వీరు వారివి ధులు, బాధ్యతలను నిర్వహిస్తారు. గ్రామాల్లో అంగన్వాడీలు, ఎస్ఎహెచ్జీలు, గ్రామపంచాయతీల సహకారంతో రిస్క్లో ఉన్న బాలలను కోఆర్డినేటర్లు గుర్తించి, జాబితా రూపొందిస్తారు. డ్రాపవుట్లు, అనాథలు, సింగిల్పేరెంట్పిల్లలు, బాలకార్మికులు, హెచ్ఐవీబాధిత, అంగవైక్యలంఉన్నబాలలు, బాల్యవివాహబాధితులు, వీధిబాలలవివరాలనునమోదుచేస్తారు.
2020లో మహిళా, శిశు సంక్షేమం కోసం నిర్వహిస్తున్న కార్యక్రమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.127.63 కోట్లు విడుదల చేసింది. అలాగే, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖకు రూ.37.38 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ కార్యక్రమాలకు ప్రభుత్వం రూ.293.73 కోట్లు విడుదల చేసింది.
రాష్ట్రంలోని మహిళా, శిశు, వికలాంగ, వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ.74 కోట్ల రూపాయలు విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 27 డిసెంబర్ 2020న మహిళా కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ చైర్పర్సన్గా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరో ఆరుగురిని కమిషన్ సభ్యులుగా సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషన్లో సభ్యురాలిగా నియమితురాలైన 1) గద్దల పద్మ ఉమ్మడి వరంగల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా పనిచేశారు. 2) పెద్దపల్లికి చెందిన కటారి రేవతిరావు ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. 3) నిజామాబాద్ పట్టణానికి చెందిన సూదం లక్ష్మి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసి, కార్పొరేటర్గా ఎన్నికయ్యారు. 4) ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లికి చెందిన కుమ్ర ఈశ్వరీబాయి ఎంపీపీగా, ఐటీడీఏ డైరెక్టర్గా పనిచేశారు. 5) హైదరాబాద్ నగరానికి చెందిన షాహీన్ అఫ్రోజ్ మలక్పేట మార్కెట్ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. 6) మంచిర్యాల జిల్లా భీమారం మండలం ఖాజీపల్లికి చెందిన కొమ్ము ఉమాదేవి టీఆర్ఎస్ నాయకురాలిగా పనిచేస్తున్నారు.