1. తెలంగాణ రాష్ట్రం 112.08 లక్షల హెక్టార్ల విస్తీర్ణంతో ఏర్పాటైంది. 2 ప్రధాన నదులు గోదావరి మరియు కృష్ణ తెలంగాణ నేల మీద పారుతున్నాయి. రెండు నదులలో సుమారు 1266.94 టిఎంసి (గోదావరి బేసిన్లో 967.94 టిఎంసి మరియు కృష్ణ బేసిన్లో 299 టిఎంసి) మిగులు జలాలు 500 టిఎంసి ఉపయోగించుకునే అర్హత ఉంది.
2. తెలంగాణ ఏర్పడిన తరువాత, రాష్ట్ర వ్యాప్తంగా మేజర్/మీడియం, ఎత్తిపోతల పథకాలు, చెరువుల కింద సుమారు ఒక కోటి ఎకరాలకు నీటిపారుదల సౌకర్యంను (ప్రతి గ్రామీణ నియోజకవర్గాలలో 1 లక్ష ఎకరాలు) కల్పించడం ద్వారా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి నీటిపారుదల రంగం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది.
3. దీనిని సాధించడానికి, భారీ నీటిపారుదల ప్రాజెక్టులను మరియు భారీ పరిమాణం లిఫ్ట్ నీటి పారుదల పథకాలు, పూర్వపు తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డేవలప్మెంట్ కార్పొరేషన్ (టిఎస్ఐడిసి) నిర్వహించిన చిన్న లిఫ్ట్ నీటి పారుదల పథకాల పునరుద్ధరణ, నిర్మాణం, రాష్ట్ర వ్యాప్తంగా 46,000 చెరువులను మిషన్ కాకతీయ కింద పునరుద్దరణ, వాగుల మీద 1200 చెక్ డ్యాంల నిర్మాణం మరియు భారీ & మధ్య తరహ సాగునీటి ప్రాజెక్టుల కాలువలపై 3000 తూముల నిర్మాణం చేపట్టడతో సాగునీటి చెరువులు, నీటి వనరులకు నీరు సరఫరా చేయడం ద్వారా కొత్త అయకట్టు మరియు ఇప్పటికే ఉన్న అయకట్టు స్థిరీకరణకు తెలంగాణ ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టింది.
4. 20.39 లక్షల ఎకరాల (2004-14 మధ్యకాలంలో 5.71 లక్షల ఎకరాలతో సహా) కొత్త నీటిపారుదల సంభావ్యత సృష్టించడంతోపాటు భారీ & మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులు, నీటి పారుదల చెరువులు / నీటి వనరులు మరియు పూర్వపు టిఎస్ఐడిసి కింద చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ద్వారా 31.49 లక్షల ఎకరాల అయకట్టు స్థిరీకరణలోకి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ప్రతిపాదిత 125.06 లక్షల ఎకరాలలో మొత్తం 72.55 లక్షల ఎకరాలు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల క్రింద (పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న 52.16 లక్షల ఎకరాలతో కలిపి) నీటిపారుదల సౌకర్యం సృష్టించబడింది. మిగిలిన 52.51 లక్షల ఎకరాల నీటిపారుదల సదుపాయం రాబోయే 2 నుండి 3 సంవత్సరాల కాలంలో సృష్టించబడుతుంది. చాలా ప్రాజెక్టులు పూర్తి కావచ్చే దశలో ఉన్నందున మరియు పంపిణీ కాలువ పనులు మెరుగైన పురోగతిలో ఉన్నందున రాబోయే 2 నుండి 3 సంవత్సరాలలో మిగిలిన 52.51 లక్షల ఎకరాల అయకట్టుకు సాగునీటి కల్పన కూడా సాధించబడుతుంది.
5. పైన పేర్కొన్నవి కాకుండా, రాష్ట్రంలో భూగర్భ జలమట్టం అసాధారణంగా మెరుగుపడింది. నీటి మట్టం వరకు లోతు (డిటిడబ్ల్యుఎల్ ని మీ లలో భూ స్థాయి నుండి క్రిందకు (బిజిఎల్) కొలుస్తారు ). 2021 ఏప్రిల్లో రాష్ట్రంలో సగటు భూగర్భజల మట్టం 9.02 మీ కాగా, 2020 అదే నెలలో ఇది 11.05 మీ ఉంది అంటే 2.03 మీ పెరిగింది. గత దశాబ్దం (2011-20) యొక్క సగటుతో పోల్చినప్పుడు ఏప్రిల్ 2021 లో భూగర్భ జాలం లోతు (డిటిడబ్ల్యుఎల్) అద్భుతంగా మెరుగుపడింది. ఉదాహరణకు 2021 ఏప్రిల్ నెలలో భూగర్భజల మట్టం 5 మీ కంటే తక్కువ లోతులో రాష్ట్రం మొత్తంలో 15% ఉండగా, గత దశాబ్దంలో (సగటు) ఇది 2% మాత్రమే ఉంది. అదేవిధంగా, 2021 ఏప్రిల్ నెలలో భూగర్భజల మట్టం 5 మీ నుండి 10 మీ వరకు రాష్ట్రం మొత్తంలో 51% వరకు ఉండగా, గత దశాబ్దంలో (సగటు) ఇది రాష్ట్రం మొత్తంలో 35% మాత్రమే.
6. తెలంగాణ రాష్ట్రం ప్రారంభమైనప్పటి నుండి సాగునీటి కల్పన (ఇరిగేషన్ పొటెన్షియల్) న్ సాగునీటి వినియోగం (ఐపియు) ఈ క్రింది విధంగా పెరిగింది. ఐపియు 2014 -15 సంవత్సరంలో 23.44 లక్షల ఎకరాలు, 2015 -16 లో 6.68 లక్షల ఎకరాలు 2016 -17 లో 47.78 లక్షల ఎకరాలు 2017 -18 లో 41.79 లక్షల ఎకరాలు 2018 -19 లో 48.14 లక్షల ఎకరాలు 2019 -20 లో 60.68 లక్షల ఎకరాలు 2020 -21 లో 85.89 లక్షల ఎకరాలు. కొత్త రాష్ట్రం తెలంగాణలో ఇప్పటికే సాధించిన నీటిపారుదల విస్తీర్ణం ద్వారా రికార్డు స్థాయిలో ఆహార ధాన్యం ఉత్పత్తిని సాధించింది. 2020-21 లో భారత ఆహార సంస్థ (FCI) ద్వారా బియ్యం సేకరణలో పంజాబ్ తరువాత దేశంలో తెలంగాణ రెండవ స్థానంలో నిలిచింది.
7. రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి రూ 1.59 లక్షల కోట్లు (ఫైనాన్షియల్ కార్పొరేషన్ (కెపిసిసిఎల్ / టిఎస్డబ్ల్యుఐడిసిఎల్) ద్వారా ఖర్చుచేసిన రూ 59,413 కోట్లతో కలిపి) మేజర్, మీడియం మరియు మైనర్ ఇరిగేషన్ స్కీంలలో ఖర్చుచేయబడ్డాయి, ఇది దేశంలనే అత్యధికం మరియి చారిత్రాత్మకం. పూర్వపు ఆంధ్రప్రదేశ్లో ఈ పదేళ్ళ కాలంలో(2004-14) తెలంగాణ ప్రాజెక్టులపై పెట్టిన ఖర్చు కేవలం 38,000 కోట్ల రూపాయలు మాత్రమే.
8. భూసేకరణ కోసం 2013 భూసేకరణ మరయు పునరావాస (ఎల్ఏఆర్ఆర్) చట్టంలో పొందుపరచిన నిబంధనలను అనుసరించి ప్రాజెక్టులను సకాలంలోపూర్తిచేయడానికి వీలుగా భూసేకరణ ప్రక్రియను వేగవంతంచేయడానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని(రాష్టం లోపల & ఇతర రాష్టాలలో ) చేపట్టింది. పాతచట్టం(1894) మరియు కొత్తచట్టం- 2013 ప్రకారం 2.489 లక్షల ఎకరాలు G.O.Ms నెం .123 ప్రకారం 0.526 లక్షల ఎకరాలు మరియు G.O.Ms నెం .120 ప్రకారం 0.626 లక్షల ఎకరాలుతో కలిపి 3.641 లక్షల ఎకరాలు భూసేకరణ చేయడంలో విజయవంతమైంది. ఇందుకు అయిన మొత్తం ఖర్చు రూ 10,032.50 కోట్లు మరియు సేకరణ చేసుకోవాల్సిన మిగిలిన భూమి 0.536 లక్షల ఎకరాలు.
9. 14 ప్రాజెక్టులలో 110 గ్రామాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు (ఆర్అండ్ఆర్)చేయవలసి ఉంది. ఈ బాధిత గ్రామాల కోసం 87 పునరావాస (ఆర్అండ్ఆర్) కేంద్రాల్ని ప్రతిపాదించారు. మొత్తం జారీ చేసిన ఇళ్ల పట్టాల సంఖ్య 45,240. ఇందులో 23,481 ఇళ్ళు నిర్మించబడ్డాయి. ఆర్అండ్ఆర్ అవసరమైన మొత్తం రూ 3,249 కోట్లు, ఇందులో ఇప్పటిదాకా వెచ్చించిన మొత్తం వ్యయం రూ 2,370 కోట్లు. రాష్ట్రంలో ప్రాజెక్ట్ ల ముంపు ప్రాంతం నుండి తరలించవలసిన మొత్తం కుటుంబాలు 45,516. ఇప్పటికే 37,082 కుటుంబాలు ( పిడిఎఫ్) పునరావాస కేంద్రాలకు తరలించబడ్డాయి.
10. చిన్న చెరువులు & నీటి వనరులు రంగంలో, మిషన్ కాకతీయ కింద ఇప్పటి వరకు 20.48 లక్షల ఎకరాల అయకట్టు కలిగి ఉన్న 27,625 చెరువులను నాలుగుదశల్లో పునరుద్ధరించడానికి రూ 9,155.97 కోట్లతో ప్రతిపాదించడమైనది. దీనిలో 21,436 చెరువులను పునరుద్ధరించడానికి రూ 7,170.58 కోట్లు ఖర్చు చేయడంతో పాటు మరియు 8.93 టిఎంసి నిల్వ సామర్థ్యాన్ని సక్రమంగా పునరుద్ధరించడం ద్వారా 15.05 లక్షల ఎకరాలు స్టీరీకరించబడ్డాయి. అన్ని చెరువులలో నీటి లభ్యత పెరిగడం ఫలితంగా మత్స్యరంగం గణనీయంగా వృద్ధిచెందింది.
11. రాష్ట్రంలోని అన్నీ గ్రామాల్లో, పట్టణాల్లో ఇంటింటికి స్వచ్చమైన తాగునీటిని నల్లా ద్వారా అందించాలన్న లక్ష్యంతో ప్రారంభించిన పథకం మిషన్ భగీరథ. మిషన్ భగీరథ కోసం రాష్ట్రంలో ఉన్న అన్నీ జలాశయాల్లో 10 శాతం నీటిని కేటాయించిది ప్రభుత్వం. గోదావరి బేసిన్లో 32.58 టిఎంసిలు, కృష్ణా బేసిన్ లో 23.44 టిఎంసిలు మిషన్ భగీరథ పథకానికి ప్రభుత్వం కేటాయించింది. ఇవి రాష్ట్రానికి ట్రిబ్యునల్స్ ద్వారా కేటాయించిన నీటిలో నుంచే తాగునీటికి వినియోగించడం జరుగుతున్నది. జలాశయాల్లో నిర్ణీత కనీస మట్టాలను(MDDL) తప్పనిసరిగా కాపాడాలని ప్రభుత్వం ఆదేశించింది. మిషన్ భగీరథ పూర్తి అయి దేశ వ్యాప్తంగా గొప్ప పథకంగా ప్రశంసలు అందుకున్నది. ఎన్నో పురస్కాలను అందుకున్నది. దేశంలో వంద శాతం గ్రామాలకు సురక్షిత తాగునీటి సౌకర్యం కల్పించిన రాష్ట్రం తెలంగాణ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
12. 2020-21 సంవత్సరంలో రూ 18,256 కోట్ల వ్యయంతో 15,117 ఎకరాలను భూసేకరణ చేయడం ద్వారా 1.89 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృస్టించడినది. ప్రస్తుతం, పాలమురు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, సీతారామ ఎత్తిపోతల పథకం, దిండి ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్, సమ్మక్క సాగర్ బ్యారేజ్, చనాకా కోరాట బ్యారేజి, సదర్ మాత్ బ్యారేజి, సీతమ్మ సాగర్ బ్యారేజి వంటి ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుల పనులు మెరుగైన పురోగతిలో ఉన్నాయి మరియు ఈ ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం అకుంటిత దీక్షతో పనిచేస్తు ఉంది.
13.2020-21 సంవత్సరంలో 4651 చెరువులకు/నీటి వనరులకు భారీ & మధ్య తరహా, ఎత్తిపోతల ప్రాజెక్టుల కాలువల నుండి నీటిని నింపడం జరిగింది.
ఈ విధంగా, ప్రభుత్వ నిరంతర కృషి మరియు నిబద్ధతచే తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలు మరియు ఉద్దేశ్యాలు రాబోయే 2 నుండి 3 సంవత్సరాలలో నెరవేరుతాయి. దానితో రాష్ట్ర గ్రామీణ ఆర్థిక రంగం యొక్క అభివృద్ధి మరియు అన్నీ రంగాల ఆర్థిక వృద్ధి నీటి పారుదల రంగం ద్వారా సాకారం అవుతాయి.