బీచ్కు వెళ్తే బికినీ వేయాల్సిందే. అదే నేటి ట్రెండ్. బికినీ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. సినిమాల్లోనూ బికినీ కల్చర్ పెరిగిపోయింది. దాదాపు అన్ని సినిమా ఇండస్ట్రీలలో హీరోయిన్లు బికినీలు వేసుకొని కుర్రకారు మతి పోగొడుతున్నారు. తాజాగా బాలీవుడ్కు చెందిన స్టార్ హీరోయిన్ బికినీ వేసుకొని బీచ్లో హాయిగా సేదతీరుతోంది. చిల్ అవుతోంది. ఆ ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది ఆ ముద్దుగుమ్మ. దీంతో ఆ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? బాలీవుడ్తో పాటు తెలుగులోనూ ఒక సినిమాలో నటించి తన సత్తా చాటిన ఆ భామ ఎవరో కాదు.. దిశా పటానీ.
దిశా పటానీ.. తెలుగు సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో దిశా పటానీ తొలిసారి హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత తనకు బాలీవుడ్లో అవకాశాలు రావడంతో బాలీవుడ్కు షిఫ్ట్ అయిపోయింది.
తాజాగా పింక్ బికినీ వేసుకొని వెకేషన్ను సూపర్బ్గా ఎంజాయ్ చేస్తోంది. వావ్.. స్టన్నింగ్ లుక్.. సూపర్బ్.. అంటూ నెటిజన్లు ఆమె పోస్ట్కు కామెంట్లు చేస్తున్నారు. అయితే.. దిశా పటానీ.. ఇలాంటి హాట్ ఫోటోలను షేర్ చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇదివరకు చాలాసార్లు తను బీచ్లో దిగిన ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసి వావ్.. అనేలా చేసింది.