హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ ): పట్టణాభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్నదని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా కొనియాడారు. పీఎం స్వాన్ నిధి అమలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని ప్రశంసించారు. ఈ విషయంలో తెలంగాణకు ఇతర ఏ రాష్ట్రం సమీపంలో కూడా లేదని తెలిపారు. శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన బీఆర్కేఆర్ భవన్లో మున్సిపల్, పట్టణాభివృద్ధి పథకాల అమలుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అమృత్, స్మార్ట్సిటీ మిషన్, స్వచ్ఛభారత్ మిషన్, పీఎం స్వాన్నిధి, హౌసింగ్ ఫర్ ఆల్ తదితర పథకాల పురోగతిని సమీక్షించారు.
పట్టణాభివృద్ధి శాఖలో చేపట్టిన పనులపై రాష్ట్ర మున్సిపల్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నేషనల్ ఆర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అమలులో సాధించిన పురోగతిని వివరించారు. పీఎం స్వాన్ నిధి, అమృత్ పథకాలను రాష్ట్రంలో విజయవంతంగా అమలుచేస్తున్నారని దుర్గాశంకర్ మిశ్రా ప్రశంసించారు. ‘ఎక్సలెంట్ పెర్ఫామెన్స్’ అని కితాబిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్ అండ్ బీ, గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, మున్సిపల్శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, కేంద్ర పట్టణాభివృద్ధి సంయుక్త కార్యదర్శి సంజయ్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, జలమండలి ఎండీ దానకిషోర్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ ): పట్టణాభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తున్నదని కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ కార్యదర్శి దుర్గాశంకర్ మిశ్రా కొనియాడారు. పీఎం స్వాన్ నిధి అమలులో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉన్నదని ప్రశంసించారు. ఈ విషయంలో తెలంగాణకు ఇతర ఏ రాష్ట్రం సమీపంలో కూడా లేదని తెలిపారు. శనివారం హైదరాబాద్ వచ్చిన ఆయన బీఆర్కేఆర్ భవన్లో మున్సిపల్, పట్టణాభివృద్ధి పథకాల అమలుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అమృత్, స్మార్ట్సిటీ మిషన్, స్వచ్ఛభారత్ మిషన్, పీఎం స్వాన్నిధి, హౌసింగ్ ఫర్ ఆల్ తదితర పథకాల పురోగతిని సమీక్షించారు.
పట్టణాభివృద్ధి శాఖలో చేపట్టిన పనులపై రాష్ట్ర మున్సిపల్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నేషనల్ ఆర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అమలులో సాధించిన పురోగతిని వివరించారు. పీఎం స్వాన్ నిధి, అమృత్ పథకాలను రాష్ట్రంలో విజయవంతంగా అమలుచేస్తున్నారని దుర్గాశంకర్ మిశ్రా ప్రశంసించారు. ‘ఎక్సలెంట్ పెర్ఫామెన్స్’ అని కితాబిచ్చారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్ అండ్ బీ, గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, మున్సిపల్శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, కేంద్ర పట్టణాభివృద్ధి సంయుక్త కార్యదర్శి సంజయ్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, జలమండలి ఎండీ దానకిషోర్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.