న్యూఢిల్లీ: ప్రపంచ మహిళా దినోత్సవం నాడు వివిధ రంగాల్లో మహిళలు చేసిన వస్తువులను కొనుగోలు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అస్సాం మహిళలు చేసిన గముచా, నాగాలాండ్ నుంచి షాల్, గోండ్ పేపర్ పెయిటింగ్లను కొన్నట్లు ఆయన తన ట్విటర్తో ద్వారా వెల్లడించారు. మహిళల వ్యాపారాలు, సృజనాత్మకత, భారతదేశ సంస్కృతిని సెలబ్రేట్ చేసే ఉద్దేశంతో ఈ వస్తువులు కొన్నట్లు మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్గా మారేందుకు ఇండియా చేస్తున్న ప్రయత్నంలో మహిళలు కీలకపాత్ర పోషిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి నిబద్ధులమవుదాం. ఇవాళ నేను మహిళా పారిశ్రామికవేత్తలు చేసిన కొన్ని ఉత్పత్తులను కొనుగోలు చేశాను అని మోదీ ట్వీట్ చేశారు.