న్యూఢిల్లీ : 2020 వరకూ వర్క్ ఫ్రం హోం చాలామందికి నెరవేరని కలగా ఉండగా మహమ్మారి విజృంభణతో గత ఏడాదికి పైగా ఇప్పుడది పలువురి జీవితాల్లో భాగమైంది. ఇంట్లో పనులు చక్కబెడుతూనే ఆఫీస్ పనులు చక్కదిద్దడం సర్వసాధారణమైంది. ఇప్పుడు వర్క్ ఫ్రం వెడ్డింగ్స్ అంటూ కొత్త ట్రెండ్ ప్రారంభమైందా అనేలా ఓ పెండ్లికొడుకు ఏకంగా పెండ్లి మంటపంపైనే ల్యాప్టాప్తో కూర్చున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
పెండ్లి తంతు పక్కనపెట్టుకుని అర్జంట్ మీటింగ్ అంటూ ల్యాప్టాప్తో పెండ్లికొడుకు కుస్తీ పట్టడంతో నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు. ల్యాప్టాప్తో పనిచేసుకుంటున్న పెండ్లికొడుకు కెమెరా కంటికి చిక్కగా కొంచెం దూరంగా పెండ్లికూతురు నవ్వుతూ సోఫాలో కూర్చున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి.
దుల్హానియా అనే పేజ్ ఇన్స్టాలో ఈ వీడియోను పోస్ట్ చేసింది. వెల్కం టూ వెడ్డింగ్స్ 21 అనే క్యాప్షన్ ఇచ్చింది. తన పెండ్లి వేడుకనూ అతడు ఎంజాయ్ చేయలేకపోతున్నాడని పలువురు నెటిజన్లు కామెంట్ చేయగా పెండ్లికి హాజరైన వారిలో కొందరు ఈ శుభకార్యానికి హాజరు కాని వారి కోసం వర్చువల్ వెడ్డింగ్కు కెమెరాను సెట్ చేస్తున్నాడని చెప్పుకొచ్చారు.