హైదరాబాద్ : రాష్ర్టంలోని దళితుల పట్ల సీఎం కేసీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. దళిత అభ్యున్నతికి వరాల వర్షం కురపించారు. రూ. వెయ్యి కోట్ల నిధులతో సీఎం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అనే పథకాన్ని రూపొందించినట్లు శాసనసభ వేదికగా ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. రాష్ర్టంలోని షెడ్యూల్ కులాల ప్రజలకు ఈ పథకం ద్వారా పెద్ద ఎత్తున ప్రయోజనాలు కలగనున్నాయని మంత్రి హరీష్ రావు చెప్పారు. ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 21,306.85 కోట్లు, ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 12,304. 23 కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు.