న్యూఢిల్లీ: వచ్చే నెల 1 నుంచి కరోనా వైరస్ వ్యాక్సిన్ను 60 ఏళ్ల పైబడిన వారికి కూడా ఇవ్వనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం వెల్లడించారు. అంతేకాదు రెండు, అంతకన్నా ఎక్కువ వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్ల పైబడిన వ్యక్తులకు కూడా ఇస్తామని చెప్పారు. దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్ సెంటర్లలో వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సెంటర్లలో ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని స్పష్టం చేశారు.