లక్నో : ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా పరిధిలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై శనివారం ఉదయం ఘోరప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ క్రమంలో ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పలు వాహనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వాహనాలు ఢీకొనడంతో అక్కడ భారీగా ట్రాఫిక్జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ను క్రమబద్దీకరించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.