నల్లగొండ : మా ఊరికి మిషన్ భగీరథ నీళ్లు ఇంకా రాలేదు అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కానీ జానారెడ్డి మాట్లాడిన మాటలు ఉత్తుత్తి మాటలు అని ఈ వీడియో చూసిన తర్వాత తేలిపోయింది. హాలియా మండలం అనుముల గ్రామంలో జానారెడ్డి ఇంట్లో మిషన్ భగీరథ నీళ్లు వృథాగా పోతున్నాయి. ఆ ఇంట్లో ఎవరూ లేనప్పటికీ.. నల్లాను మాత్రం ఖాళీగా వదిలిపెట్టారు. తమ ఊరికి భగీరథ నీళ్లు ఇంకా రాలేదన్న జానారెడ్డి మాటలు.. ఈ వీడియో చూసిన తర్వాత పచ్చి అబద్ధమని తేలిపోయింది.
అనుముల గ్రామానికి మిషన్ భగీరథ నీళ్లు రాలేదన్న జానారెడ్డి మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో గత మూడేళ్ల నుంచి ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి. జానారెడ్డి ఇంటికి కూడా మిషన్ భగీరథ నీళ్లు ఇస్తున్నాం అని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.