యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులో భాగంగా నూతనంగా నిర్మించిన ప్రధానాల యానికి తిరు వీధుల్లో ఈశాన్య ప్రాంతంలోని హైమాస్ట్ లైట్ స్తంభాన్ని మంగళవారం ఆలయ అధికారులు తొలగించారు. ఈ స్తంభాన్ని స్వామివారి బాలాలయ ప్రాంగణంలో అమర్చ నున్నామని ఆలయ అధికారులు తెలిపారు.
ఇప్పటికే యాదాద్రికి స్వర్ణవర్ణపు విద్యుద్దీపాలంకరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ప్రధానాలయంతో ఆలయ పుర వీధులు, బాహ్య, అంతర ప్రాకారాలతో పాటు ఆలయ ప్రహరీ చుట్టూ అధునాతన లైటింగ్ను బిగింపు ప్రక్రియ పూర్తి కావొచ్చింది.