కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు మూడు గేట్ల ద్వారా శనివారం దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి 4413.05 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో ప్రాజెక్టు 3 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 3839.53 క్యూసెక్కులు, కాలువలకు 573.50 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.20 అడుగులుగా (3.99 టీఎంసీలు) నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.