కొండాపూర్, ఏప్రిల్ 26 : రైతులకు అందుబాటులో ధాన్యం కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. సోమవారం కొండాపూర్ మండలం మల్కాపూర్, తొగర్పల్లి గ్రామాల్లో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో రైతులకు అందుబాటులో వరి ధాన్యం కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్ముకోవాలన్నారు. నయా పైసా ఖర్చు కాకుండా ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్లు భాగ్యవతి, మౌనిక, ప్రకాశం, ఎంపీపీ మనోజ్రెడ్డి, జడ్పీటీసీ పద్మావతి పాండురంగం, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డి, ఆర్డీవో మెంచు నగేశ్, డీఎస్వో ప్రసాద్, సొసైటీ చైర్మన్లు పవన్కుమార్, రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశం, ఎంపీటీసీలు సంతోష, రాందాస్, టీఆర్ఎస్ నాయకుడు జగదీశ్వర్, మండల వ్యవసాయాధికారి ప్రతిభ, ఏఈవోలు రవి, మనోహర్, చందర్ తదితరులు పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర..
పుల్కల్, ఏప్రిల్ 26 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పంటకు మద్దతు ధర లభిస్తున్నదని ఎంపీపీ పట్లోళ్ల చైతన్య విజయ్భాస్కర్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని పోచారం, పుల్కల్, పోసానిపల్లి, ముద్దాయిపేట, ముదిమాణిక్యం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ప్రభు త్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి క్వింటాల్కు రూ.1888 ధర లభిస్తుందని తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దళారుల పాలు చేయొద్దని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మధులత, తహసీల్దార్ పరమేశ్, ఎంపీటీసీలు శ్రీనివాస్ చారి, సర్పంచ్లు శ్యాంరావు, స్వాతి కనకారెడ్డి, శ్రావణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.