ముంబై: దేశంలో మరో పెద్ద విలీన ప్రక్రియ జరగనుంది. టీవీ ఎంటర్టైన్మెంట్ రంగంలో రెండు దిగ్గజ సంస్థల మధ్య విలీన ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (ఎస్పీఎన్ఐ)లో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ విలీనం కాబోతోంది. ఈ మేరకు జీ బోర్డు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. దక్షిణాసియాలోని లీడింగ్ మీడియా, ఎంటర్టైన్మెంట్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కు మరింత వృద్ధి, లాభాలు ఆర్జించిపెట్టే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.
విలీనం తర్వాత ఈ సంస్థలో మెజార్టీ వాటా సోనీ నెట్వర్క్ చేతుల్లోనే ఉండనుంది. విలీనంలో భాగంగా రెండు కంపెనీల నెట్వర్క్లు, డిజిటల్ ఆస్తులు, ప్రొడక్షన్ ఆపరేషన్లు, ప్రోగ్రామ్ లైబ్రరీలను కలపాలని రెండు సంస్థలు నిర్ణయించాయి. విలీనం తర్వాత ఏర్పడే సంస్థ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీగా ఉండనుంది. వచ్చే 90 రోజుల్లో ఈ విలీన ప్రక్రియ పూర్తి కానుంది.