న్యూఢిల్లీ: ప్రముఖ వైద్యులు డాక్టర్ కాకర్ల సుబ్బారావు మృతిపట్ల ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వైద్యరంగానికి కాకర్ల సేవలు చిరస్మరణీయమని, ఆయన సేవానిరతి, అంకితభావం వైద్యులకు ఆదర్శనీయమని చెప్పారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషిచేశారని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఈమేరకు ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు.
‘ప్రముఖ వైద్యులు డా. కాకర్ల సుబ్బారావు గారు పరమపదించారని తెలిసి విచారం వ్యక్తం చేస్తున్నాను. తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వైద్యరంగానికి వారు చేసిన సేవలు చిరస్మరణీయం. సేవానిరతితో వృత్తికే జీవితాన్ని అంకితం చేసిన ఆయన, వైద్యులందరికీ ఆదర్శప్రాయులు. రేడియాలజిస్టుగా, ఉస్మానియా వైద్యకళాశాల అధ్యాపకుడిగా, నిమ్స్ ఆసుపత్రి సంచాలకులుగా పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు వారు విశేష కృషి చేశారు. డా. కాకర్ల సుబ్బారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని వెంకయ్య నాయుడు ట్వీట్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..