కరోనా కట్టడి కోసం సూపర్ స్ప్రెడర్లకు ఈ నెల 28 నుంచి ప్రత్యేకంగా టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వారి గుర్తింపు, వ్యాక్సినేషన్కు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నది. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లకు ఉంటారని అంచనా. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం మేరకు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు, సీఎస్ సోమేశ్కుమార్ మంగళవారం హైదరాబాద్లోని బీఆర్కేభవన్లో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రజలతో ఎక్కువగా మమేకమై ఉండే సూపర్ స్ప్రెడర్లకు టీకాలు వేసే అంశంపై చర్చించారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి గ్యాస్ డెలివరీ సిబ్బంది, రేషన్ డీలర్లు, పెట్రోల్ బంక్ కార్మికులు, ఆటో, క్యాబ్, బస్ డ్రైవర్లు, రైతుబజార్లలోని విక్రేతలు, పండ్లు, కూరగాయలు, పూలు, మాంసాహార మార్కెట్లు, కిరాణా, మద్యం దుకాణాల్లోని సిబ్బందికి టీకాలు వేయాలని అధికారులను ఆదేశించారు. సూపర్స్ప్రెడర్ల గుర్తింపు, టీకా సరఫరాపై చర్చించారు. కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, పురపాలక శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావు, డీహెచ్ శ్రీనివాస్రావు తదితరులు పాల్గొన్నారు.