న్యూఢిల్లీ: షహీద్ దివస్ సందర్భంగా మంగళవారం ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధులైన భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులకు నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. వాళ్ల త్యాగాలు ఈ దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని మోదీ అన్నారు. ముగ్గురూ కలిసి బ్రిటీష్ పోలీస్ అధికారి జేపీ శాండర్స్ను హత్య చేశారు. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం వీరికి మరణశిక్ష విధించింది. అమరవీరుల దినోత్సవం నాడు విప్లవకారులు భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులకు జోహార్లు అని మోదీ ట్వీట్ చేశారు. భరతమాత ముద్దుబిడ్డలైన వీళ్ల త్యాగాలు అన్ని తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఆయన అన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం ఈ ముగ్గురినీ ఇదే రోజు ఉరితీసింది. లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారంగా ఈ