హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం పాలసీపై విధివిధానాలు రూపొందించాలని ఆబ్కారీశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 30తో బార్ల లైసెన్స్, అక్టోబర్ 31తో వైన్షాప్ల లైసెన్స్ల గడువు ముగియనున్న నేపథ్యంలో గురువారం రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 2021-22 సంవత్సరానికి వైన్స్, బార్ లైసెన్స్లకు సంబంధించిన నిబంధనలు తయారుచేయాలని సూచించారు. సమావేశంలో ఆబ్కారీశాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు కమిషనర్ అజయ్రావు, డిప్యూటీ కమిషనర్ హరికిషన్ పాల్గొన్నారు.
మంత్రి శ్రీనివాస్గౌడ్కు ఉద్యోగుల అభినందనలు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన వేతన సవరణ (పీఆర్సీ)ని ఉద్యోగులకు వర్తింపజేసేందుకు కృషిచేసిన మంత్రి శ్రీనివాస్గౌడ్కు ఉద్యోగులు అభినందనలు తెలిపారు. మంత్రి కలిసినవారిలో పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగుల జేఏసీ నాయకులు నర్సింహారావు, సంపత్కుమార్, రాజలింగం, ఇబ్రహీం, అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.