హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): రహదారుల నిర్మాణంలో హైదరాబాద్ దేశంలోని అన్ని నగరాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో రూ.8,411.65 కోట్లతో ఎస్సార్డీపీ, సీఆర్ఎంపీ, హెచ్ఆర్డీసీఎల్ అనే మూడు కార్యక్రమాల ద్వారా ైప్లెఓవర్లు, రోడ్లు, లింక్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఇతరరాష్ర్టాలు, నగరాల నుంచి మన అధికారులకు ఫోన్లుచేస్తూ లింక్రోడ్ల అభివృద్ధిపై ఆరా తీస్తున్నారని అన్నారు. సోమవారం హైదరాబాద్ నోవాటెల్ వెనుక జంక్షన్ వసంత్సిటీ వద్ద 3 లింక్రోడ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ మహానగరం అన్నివైపులా మౌలికవసతుల విస్తరణలో దూసుకుపోతున్నదన్నారు. ఏ రాష్ర్టానికైనా, నగరానికైనా రహదారులే అభివృద్ధికి సూచికలని, హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలుచేస్తున్నదని వివరించారు.
6 వేల కోట్లతో ఎస్సార్డీపీ
ఎస్సార్డీపీ పేరుతో హైదరాబాద్లో రూ.6వేల కోట్లతో ైప్లెఓవర్లు, అండర్పాస్లు, బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మరోవైపు ఇప్పటికే ఉన్న రోడ్ల పకడ్బందీ నిర్వహణకు రూ. 1,800 కోట్లతో సీఆర్ఎంపీ కార్యక్రమం చేపట్టామన్నారు. లింక్రోడ్ల అభివృద్ధికి హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కింద జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మరో కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నామని చెప్పారు. ఇందులోభాగంగా మొదటి దశలో రూ.313.65 కోట్లతో 22 రోడ్లను ఎంచకున్నామని తెలిపారు. ప్రధాన రహదారులపై రద్దీని, కాలుష్యాన్ని తగ్గించడమే లిం క్రోడ్ల నిర్మాణం ముఖ్యఉద్దేశమని వివరించారు. ప్రణాళికబద్ధంగా వివిధ దశల్లో 133 లింక్రోడ్లను ఎంపికచేశామని చెప్పారు. నగర జీవనాన్ని సులభతరం చేయాలనే ఉద్దేశంతో, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఇవన్నీ చేస్తున్నామని తెలిపారు. లాక్డౌన్ను సద్వినియోగం చేసుకొని అనుకున్న సమయం కంటే ముందుగానే రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చిన జీహెచ్ఎంసీ కమిషనర్, సీఈకి ప్రభు త్వం తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విప్ అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.