ఆంటిగ్వా: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్లో ప్రధాన సూత్రధారి, వజ్రాల వ్యాపారి అయిన మెహుల్ చోక్సీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది అతని గర్ల్ఫ్రెండ్గా భావిస్తున్న బార్బరా జారాబికా. అతని కిడ్నాప్ ఉదంతంలో తన పాత్ర ఏమీ లేదని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేసింది. గతేడాది తాను ఆంటిగ్వా వెళ్లినప్పుడు చోక్సీ తనకు పరిచయమయ్యాడని, తనను తాను రాజ్గా పరిచయం చేసుకున్నాడని చెప్పింది. చోక్సీ నాకు ఫ్రెండ్. గతేడాది ఆంటిగ్వా వెళ్లినప్పుడు కలిశాడు. మొదట్లో ఫ్రెండ్లీగా ఉండి తర్వాత నన్ను ఫ్లర్ట్ చేశాడు. అతడు నాకు డైమండ్ రింగులు, బ్రేస్లెట్లు కూడా ఇచ్చాడు కానీ అవన్నీ నకిలీవని తర్వాత తెలిసింది అని ఆమె చెప్పింది.
తన పేరును అనవసరంగా చోక్సీ లాయర్లు, కుటుంబ సభ్యులు ఇందులోకి లాగారని బార్బరా తెలిపింది. చోక్సీ కిడ్నాప్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను, నా కుటుంబం తీవ్ర ఒత్తిడిలో ఉన్నామని ఆమె చెప్పింది. తనను బార్బరా జారాబికా ఇంటి నుంచి కిడ్నాప్ చేశారని, బోట్లో డొమినికాకు తీసుకొచ్చారని ఆంటిగ్వా పోలీసులకు రాసిన లేఖలో చోక్సీ చెప్పాడు.