హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఆరోగ్య, వినియోగ వస్తువుల ఉత్పత్తుల రంగంలో పేరెన్నికగన్న శ్రీశ్రీతత్వ కరోనా బాధితుల కోసం ఆయుష్-64 అనే కొత్త ఔషధాన్ని విడుదలచేసింది. ట్యాబ్లెట్ల రూపంలో లభించే ఈ మందు కరోనా ప్రారంభ, మధ్యమస్థాయిలో ఉన్నవారిపై ప్రభావవంతంగా పనిచేస్తుందని, దీనికి ఆయుష్ మంత్రిత్వశాఖ గుర్తింపు లభించిందని సంస్థ వివరించింది. దేశవ్యాప్తంగా ఏడుచోట్ల నిర్వహించిన క్లినికల్ట్రయల్స్లో ఈ ఔషధం కరోనా ప్రాథమిక, మధ్యస్థాయిల్లో ఉన్న రోగులకు ఉపశమనం కలిగించింది. ఆయుష్-64 ఔషధంపై అంతర్గతంగా జరిపిన 36 పరీక్షల్లో 35 సార్లు ఈ మందు కరోనాను ప్రభావవంతంగా అడ్డుకున్నది. ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి పద్మశ్రీ వైద్య రాజేశ్ కొటేచా, శ్రీశ్రీతత్వ మేనేజింగ్ డైరెక్టర్ అర్వింద్ వర్చస్వి, అఖిల భారత ఆయుర్వేద కాంగ్రెస్ అధ్యక్షుడు పద్మభూషణ్ వైద్య దేవేంద్ర త్రిగుణ సమక్షంలో ఆయుష్-64ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూజీసీ మాజీ వైస్ చైర్మన్ భూషణ్ పట్వర్ధన్, కేంద్ర ఆయుర్వేద వైద్య విజ్ఞాన సమాఖ్య డైరెక్టర్ జనరల్ ఎన్ శ్రీకాంత్, ఆయుర్వేద దవాఖానల వ్యవస్థాపకుడు రాజీవ్ వాసుదేవన్, 1 ఎంజీ సహ వ్యవస్థాపకుడు వికాస చౌహాన్ హాజరయ్యారు.