హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న దళిత బంధు పథకంపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం ఆరు చైతన్య గీతాలను ఆవిష్కరించారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
సోమవారం హుజూరాబాద్లో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్.. దళిత బంధు పథకాన్ని ప్రారంభించనున్నారు. 15 మంది దళితులకు ఆయన చేతుల మీదుగా చెక్లు పంపిణీ చేస్తారు. హుజూరాబాద్ జరిగే సభ ఏర్పాట్లను రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్రావు శనివారం పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరికి దళిత బంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.